Iran: ఇరాన్తో యుద్ధం.. రూ.18 లక్షల కోట్లు ఇవ్వాలని పార్లమెంటుకు అమెరికా ప్రతిపాదన
ఇరాన్తో యుద్ధం నేపథ్యంలో అమెరికాకు భారీ మొత్తంలో ఖర్చు అవుతోంది. ఇరాన్తో రానున్న రోజుల్లో భీకర యుద్ధం కొనసాగించేందుకు 200 బిలియన్ డాలర్లకు పైగా నిధులు ఇవ్వాలని అమెరికా పార్లమెంటుకు ప్రతిపాదన చేశామని, దీనికి ఆమోదం తెలపాలని పెంటగాన్ కోరినట్లు తెలుస్తోంది. మన కరెన్సీలో ఇది సుమారు రూ.18 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. ఈ మేరకు వాషింగ్టన్ పోస్టు కథనాన్ని ప్రచురించింది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం 20వ రోజుకు చేరింది.
దీనిపై ఇరాన్ స్పందించింది. ఇజ్రాయెల్ అజెండాను అమలు చేయడానికి అమెరికా సొంత పౌరులపై భారం మోపుతోందని ఆరోపించింది. ఈ యుద్ధం మొదలై మూడు వారాలే అయిందని పేర్కొంది. ఇజ్రాయెల్ అజెండా కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారని విమర్శించింది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని హెచ్చరించింది. యుద్ధం భారం సామాన్య అమెరికన్లపై పడుతోందని పేర్కొంది.
దీనిపై ఇరాన్ స్పందించింది. ఇజ్రాయెల్ అజెండాను అమలు చేయడానికి అమెరికా సొంత పౌరులపై భారం మోపుతోందని ఆరోపించింది. ఈ యుద్ధం మొదలై మూడు వారాలే అయిందని పేర్కొంది. ఇజ్రాయెల్ అజెండా కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారని విమర్శించింది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని హెచ్చరించింది. యుద్ధం భారం సామాన్య అమెరికన్లపై పడుతోందని పేర్కొంది.