ఉగాది సందర్భంగా బీజేపీ శ్రేణులకు కీలక సూచనలు చేసిన మాధవ్
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బీజేపీ కార్యాలయాల్లో ఉగాది వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని మాధవ్ ఆదేశించారు. ప్రతి కార్యాలయంలోనూ పురోహితులను పిలిపించి పూజలు నిర్వహించడంతో పాటు, కొత్త ఏడాది ఫలితాలను తెలిపే పంచాంగ శ్రవణాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
ప్రతి జిల్లాలోనూ ప్రధానమైన గ్రామ దేవతలను సందర్శించాలని చెప్పారు. పార్టీ తరఫున గ్రామ దేవతలకు సంప్రదాయబద్ధంగా సారె సమర్పించే కార్యక్రమాన్నిచేపట్టాలని సూచించారు. డప్పు వాయిద్యాలు, ఊరేగింపులతో పండుగను జరుపుకుంటూ స్థానిక ప్రజలతో కలిసి వేడుకల్లో భాగస్వామ్యం కావాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.