KD The Devil: 'సర్కే చునర్' పాట వివాదం... అసలు విషయం చెప్పిన లిరిక్ రైటర్...!
సంజయ్ దత్, నోరా ఫతేహీ నటించిన 'కేడీ - ది డెవిల్' చిత్రంలోని 'సర్కే చునర్' పాటపై చెలరేగిన వివాదంపై గీత రచయిత రకీబ్ ఆలం స్పందించారు. అభ్యంతరకరంగా ఉన్న ఆ పాట సాహిత్యాన్ని తాను రాయలేదని స్పష్టం చేశారు. ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఇప్పటికే మేకర్స్ ఈ పాటను యూట్యూబ్ నుంచి తొలగించారు.
ఈ విషయంపై ఐఏఎన్ఎస్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ రకీబ్ ఆలం పలు కీలక విషయాలు వెల్లడించారు. 'కేడీ' సినిమా కోసం తాను ఇప్పటికే 5 పాటలు రాశానని, 'సర్కే చునర్' పాట రాయమని దర్శకుడు ప్రేమ్ అడిగినప్పుడు తాను నిరాకరించానని తెలిపారు. తన శైలికి తగినట్లుగానే సాహిత్యం అందిస్తానని చెప్పినట్లు వివరించారు. అయితే, కన్నడ పాటను ఉన్నది ఉన్నట్లుగా పదం పదం అనువదించాలని దర్శకుడు కోరారని, అందుకు తాను ఒప్పుకోలేదని అన్నారు.
తాను నిరాకరించడంతో, కనీసం అనువాదంలో సహాయం చేయాలని దర్శకుడు కోరగా, ఆయన సహాయకుడితో కలిసి కన్నడ పాటను లైన్ బై లైన్ అనువదించి ఇచ్చానని రకీబ్ చెప్పారు. ఈ పాటకు తీవ్ర వ్యతిరేకత రావడంతో వెంటనే దర్శకుడికి ఫోన్ చేసి యూట్యూబ్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. పాటను తొలగించిన తర్వాత, దర్శకుడు తనను కొత్తగా సాహిత్యం రాయమని కోరారని, దానికి అంగీకరించి రాసిచ్చానని అన్నారు. త్వరలోనే క్షమాపణ నోట్తో పాటు కొత్త పాటను విడుదల చేస్తారని ఆయన వెల్లడించారు.
ఈ పాటలోని సాహిత్యం ద్వంద్వార్థాలతో, అభ్యంతరకరంగా ఉందంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్ సీ) నోటీసులు జారీ చేసింది. అంతకుముందు, న్యాయవాది వినీత్ జిందాల్ కూడా ఈ పాట మేకర్స్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్కు ఫిర్యాదు చేశారు. కొన్నిసార్లు పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం దర్శకులు, నిర్మాతలు ఇలాంటి సాహిత్యాన్ని రాయమని ఒత్తిడి తెస్తారని రకీబ్ ఆలం ఆరోపించారు.
ఈ విషయంపై ఐఏఎన్ఎస్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ రకీబ్ ఆలం పలు కీలక విషయాలు వెల్లడించారు. 'కేడీ' సినిమా కోసం తాను ఇప్పటికే 5 పాటలు రాశానని, 'సర్కే చునర్' పాట రాయమని దర్శకుడు ప్రేమ్ అడిగినప్పుడు తాను నిరాకరించానని తెలిపారు. తన శైలికి తగినట్లుగానే సాహిత్యం అందిస్తానని చెప్పినట్లు వివరించారు. అయితే, కన్నడ పాటను ఉన్నది ఉన్నట్లుగా పదం పదం అనువదించాలని దర్శకుడు కోరారని, అందుకు తాను ఒప్పుకోలేదని అన్నారు.
తాను నిరాకరించడంతో, కనీసం అనువాదంలో సహాయం చేయాలని దర్శకుడు కోరగా, ఆయన సహాయకుడితో కలిసి కన్నడ పాటను లైన్ బై లైన్ అనువదించి ఇచ్చానని రకీబ్ చెప్పారు. ఈ పాటకు తీవ్ర వ్యతిరేకత రావడంతో వెంటనే దర్శకుడికి ఫోన్ చేసి యూట్యూబ్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. పాటను తొలగించిన తర్వాత, దర్శకుడు తనను కొత్తగా సాహిత్యం రాయమని కోరారని, దానికి అంగీకరించి రాసిచ్చానని అన్నారు. త్వరలోనే క్షమాపణ నోట్తో పాటు కొత్త పాటను విడుదల చేస్తారని ఆయన వెల్లడించారు.
ఈ పాటలోని సాహిత్యం ద్వంద్వార్థాలతో, అభ్యంతరకరంగా ఉందంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్ సీ) నోటీసులు జారీ చేసింది. అంతకుముందు, న్యాయవాది వినీత్ జిందాల్ కూడా ఈ పాట మేకర్స్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్కు ఫిర్యాదు చేశారు. కొన్నిసార్లు పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం దర్శకులు, నిర్మాతలు ఇలాంటి సాహిత్యాన్ని రాయమని ఒత్తిడి తెస్తారని రకీబ్ ఆలం ఆరోపించారు.