అమెరికాలో గుండెపోటుతో వరంగల్ వాసి మృతి

ఉన్నత చదువులు చదివి, అమెరికాలో స్థిరపడ్డ ఓ తెలుగు యువ ఇంజినీర్ హఠాన్మరణం చెందాడు. వరంగల్‌కు చెందిన తాడిపత్రి రాకేశ్ (40) వర్జీనియా రాష్ట్రంలో గుండెపోటుతో మరణించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకుంది. కాగా, రాకేశ్ వరంగల్‌లోని ప్రముఖ వ్యాపారవేత్త జితేందర్ కుమారుడు.

గత పదేళ్లుగా అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా రాణిస్తూ అక్కడే స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్‌కు చెందిన తేజస్వినితో అతడికి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం వర్జీనియాలో నివాసముంటోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న రాకేశ్ చిన్న వయసులోనే గుండెపోటుతో కన్నుమూయడం అతడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.


More Telugu News