తమిళనాడులో ప్రైవేటు కాలేజీ బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు
- కుళత్తూరులోని మానవరహిత లెవల్ క్రాసింగ్ వద్ద ప్రమాదం
- పట్టాలు దాటే సమయంలో వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు
- 23 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు
సాయంత్రం వెళ్లియణై వద్ద కుళత్తూరులోని మానవరహిత రైల్వే లెవల్ క్రాసింగ్ను దాటేందుకు బస్సు డ్రైవర్ ప్రయత్నించాడు. ఆ సమయంలో వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టడంతో బస్సు వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. 21 మందిని కరూర్ ప్రభుత్వ ఆసుపత్రి, ఇద్దరిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.