'రాకాస' నుంచి మనసుని హత్తుకునే మెలోడీ... ‘పదే పదే’ సాంగ్ విడుదల
ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల నిర్మాణంలో వస్తున్న మరో ఆసక్తికర చిత్రం ‘రాకాస’. జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, ఉమేష్ కుమార్ బన్సాల్తో కలిసి నిహారిక ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంగీత్ శోభన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ‘పదే పదే’ అంటూ సాగే ఓ అందమైన మెలోడీ సాంగ్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
`పదే పదే ప్రాణం నిన్నే కోరగా, కలే నిజం కాదా నిన్ను చేరగా` అంటూ సాగే ఈ పాట, ఒక అమ్మాయి తన మనసులోని ప్రేమను వ్యక్తపరిచే సందర్భాన్ని ఆవిష్కరించింది. కిట్టు విస్సాప్రగడ అందించిన సాహిత్యం ఎంతో భావయుక్తంగా ఉంది. అనుదీప్ దేవ్ స్వరపరిచిన బాణీకి సింధూజ శ్రీనివాసన్ గాత్రం ప్రాణం పోసింది. ఈ లిరికల్ వీడియోలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, గ్రామీణ వాతావరణంలోని విజువల్స్ మనసును తాకేలా ఉన్నాయి. ఇది ఒక వన్ సైడ్ లవ్ స్టోరీ అనే భావనను కలిగిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ‘రాకాస’ గ్లింప్స్, టీజర్ ప్రేక్షకుల్లో సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఇప్పుడు ఈ మెలోడీ సాంగ్ ఆ అంచనాలను మరింత పెంచుతోంది. గతంలో నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం అవార్డులు, రివార్డులు అందుకొని మంచి పేరు తెచ్చుకుంది. ఆ విజయం తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘రాకాస’పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ, అన్వర్ అలీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. సరిగమ సంస్థ ఈ మూవీ ఆడియో హక్కులను సొంతం చేసుకుంది. ఏప్రిల్ 3న ఈ చిత్రాన్ని ఓవర్సీస్లో అథర్వణ భద్రకాళి పిక్చర్స్, కెనడాలో ప్రత్యంగిరా సినిమాస్ భారీ ఎత్తున విడుదల చేయనున్నాయి.
`పదే పదే ప్రాణం నిన్నే కోరగా, కలే నిజం కాదా నిన్ను చేరగా` అంటూ సాగే ఈ పాట, ఒక అమ్మాయి తన మనసులోని ప్రేమను వ్యక్తపరిచే సందర్భాన్ని ఆవిష్కరించింది. కిట్టు విస్సాప్రగడ అందించిన సాహిత్యం ఎంతో భావయుక్తంగా ఉంది. అనుదీప్ దేవ్ స్వరపరిచిన బాణీకి సింధూజ శ్రీనివాసన్ గాత్రం ప్రాణం పోసింది. ఈ లిరికల్ వీడియోలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, గ్రామీణ వాతావరణంలోని విజువల్స్ మనసును తాకేలా ఉన్నాయి. ఇది ఒక వన్ సైడ్ లవ్ స్టోరీ అనే భావనను కలిగిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ‘రాకాస’ గ్లింప్స్, టీజర్ ప్రేక్షకుల్లో సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఇప్పుడు ఈ మెలోడీ సాంగ్ ఆ అంచనాలను మరింత పెంచుతోంది. గతంలో నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం అవార్డులు, రివార్డులు అందుకొని మంచి పేరు తెచ్చుకుంది. ఆ విజయం తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘రాకాస’పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ, అన్వర్ అలీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. సరిగమ సంస్థ ఈ మూవీ ఆడియో హక్కులను సొంతం చేసుకుంది. ఏప్రిల్ 3న ఈ చిత్రాన్ని ఓవర్సీస్లో అథర్వణ భద్రకాళి పిక్చర్స్, కెనడాలో ప్రత్యంగిరా సినిమాస్ భారీ ఎత్తున విడుదల చేయనున్నాయి.