'రామాయణం' నుంచి రణబీర్, సాయి పల్లవి ఫొటోలు లీక్‌.. అసలు నిజం ఇదే!

Ranbir Kapoor Sai Pallavi Ramayana Photos Leaked Truth Revealed
  • రామాయణం షూటింగ్ ఫొటోలంటూ కొన్ని స్టిల్స్ వైరల్
  • అవి నకిలీవని స్పష్టం చేసిన చిత్ర యూనిట్
  • ఏఐ టెక్నాలజీతో సృష్టించిన ఫేస్-స్వాప్ చిత్రాలని వెల్లడి
  • రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్
  • ఈ ఏడాది దీపావళికి తొలి భాగం విడుదలయ్యే అవకాశం 
బాలీవుడ్ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణం’కు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు తెగ‌ చక్కర్లు కొడుతున్నాయి. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి ఉన్న ఈ ఫొటోలు సినిమా సెట్స్ నుంచి లీక్ అయ్యాయని ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారంపై చిత్రబృందం స్పందించి, అవన్నీ నకిలీవని స్పష్టం చేసింది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న చిత్రాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో సృష్టించిన ఫేస్-స్వాప్ చిత్రాలని చిత్రబృందం తెలిపింది. 2015లో వచ్చిన ‘సియా కే రామ్’ అనే టీవీ సీరియల్‌లోని స్టిల్స్‌ను ఉపయోగించి, అందులోని నటీనటుల ముఖాల స్థానంలో రణబీర్, సాయి పల్లవి ముఖాలను ఆకతాయిలు మార్ఫింగ్ చేసినట్లు వివరించింది. ఈ ఫొటోలకు, తమ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది.

నితీశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టులో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఇక రావణుడి పాత్రలో కేజీఎఫ్ ఫేమ్ యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక పోస్టర్లను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
Go Back to Shorts
Ramayana
Ranbir Kapoor
Sai Pallavi
Nitesh Tiwari
Yash
Sunny Deol
Artificial Intelligence
AI
Siya Ke Ram
Bollywood

More Telugu News