నా ఆరోగ్యం గురించి ఆందోళన వద్దు: బొత్స సత్యనారాయణ

  • బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ అంటూ ప్రచారం
  • తాను ఆరోగ్యంగా ఉన్నానన్న బొత్స
  • రొటీన్ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చానని వెల్లడి
తాను ఆరోగ్యంగానే ఉన్నానని వైసీపీ సీనియర్ నేత, శాసనమండలిలో విపక్ష నేత బొత్స నారాయణ తెలిపారు. తన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రొటీన్ హెల్త్ చెకప్ లో భాగంగానే తాను ఆసుపత్రికి వచ్చానని వెల్లడించారు. ఈ మేరకు ఆయన వివరణ ఇచ్చారు. బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ అంటూ విస్తృతంగా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. అటు, బొత్స కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రచారాన్ని ఖండించారు. 


More Telugu News