మరిది ముందే మహిళపై సామూహిక అత్యాచారం!

  • ఉత్తరాఖండ్‌లో వివాహితపై సామూహిక అత్యాచారం
  • మరిదితో కలిసి ఇంటికి వెళ్తుండగా తుపాకీతో బెదిరింపు
  • ప్రతిఘటించడంతో వేలు కోసి, వీడియో తీసిన నిందితులు
  • బాధితురాలి మరిదికి తెలిసినవారేనని పోలీసుల అనుమానం
  • ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహితపై ముగ్గురు దుండగులు తుపాకీతో బెదిరించి, ఆమె మరిది ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యాన్ని వీడియో తీసి, పోలీసులకు ఫిర్యాదు చేస్తే సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆదివారం రాత్రి గాంధీ పార్క్‌లో జరుగుతున్న సరస్ మేళా చూసి బాధితురాలు తన మరిదితో కలిసి బైక్‌పై ఇంటికి తిరిగి వస్తున్నారు. రాత్రి 9 గంటల సమయంలో కీచా బైపాస్‌లోని మోదీ మైదాన్ సమీపంలోకి రాగానే, రెండు బైక్‌లపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు వారిని అడ్డగించారు. నిందితులు బాధితురాలి మరిదికి తెలిసినవారేనని తెలుస్తోంది.

వారు తుపాకీ చూపించి ఇద్దరినీ చంపేస్తామని బెదిరించి, సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి బలవంతంగా తీసుకెళ్లారు. అక్కడ మరిది ముందే మహిళపై ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం చేశారు. బాధితురాలు ప్రతిఘటించడంతో ఓ నిందితుడు కత్తితో ఆమె ఎడమచేతి వేలును కోశాడు. అనంతరం, చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు.

బాధితురాలు ధైర్యం చేసి రాంపురా పోలీస్ ఔట్‌పోస్ట్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 70, 351(3) కింద కేసు నమోదు చేశారు. నిందితులు బాధితురాలి మరిదికి పరిచయస్తులు కావడంతో, అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు సర్కిల్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ తెలిపారు.


More Telugu News