ఏపీ హైకోర్టులో 7 క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన అంబటి రాంబాబు
- చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటిపై 7 కేసులు నమోదు
- అన్ని కేసులను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్లు వేసిన అంబటి
- నల్లపాడు పీఎస్ లో నమోదైన కేసుకు సంబంధించిన విచారణను ఈ నెల 11కు వాయిదా వేసిన హైకోర్టు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆయనపై పట్టాభిపురం, మంగళగిరి, నగరంపాలెం, నల్లపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఆయన 7 క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు.
ఇప్పటికే నల్లపాడు పీఎస్ లో నమోదైన కేసుకు సంబంధించి దాఖలైన క్వాష్ పిటిషన్ పై విచారణను ఈ నెల 11వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. మంగళగిరి పీఎస్ లో నమోదైన కేసులో తప్పనిసరిగా బీఎన్ఎస్ 35(3)ను అనుసరించాలని మంగళగిరి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
మిగిలిన 5 కేసులకు సంబంధించిన క్వాష్ పిటిషన్లు సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్వాష్ పిటిషన్లపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
మరోవైపు, అంబటిపై పీటీ వారెంట్ పొందేందుకు మంగళగిరి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే నల్లపాడు పీఎస్ లో నమోదైన కేసుకు సంబంధించి దాఖలైన క్వాష్ పిటిషన్ పై విచారణను ఈ నెల 11వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. మంగళగిరి పీఎస్ లో నమోదైన కేసులో తప్పనిసరిగా బీఎన్ఎస్ 35(3)ను అనుసరించాలని మంగళగిరి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
మిగిలిన 5 కేసులకు సంబంధించిన క్వాష్ పిటిషన్లు సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్వాష్ పిటిషన్లపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
మరోవైపు, అంబటిపై పీటీ వారెంట్ పొందేందుకు మంగళగిరి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది.