'ఇది భ్రమల ప్యాలెస్' అంటూ క్యూట్ పిక్స్ షేర్ చేసిన రాశీ ఖన్నా

  • బ్లాక్ అవుట్ ఫిట్ లో బోల్డ్ గా కనిపిస్తున్న రాశీ ఖన్నా
  • ప్రస్తుతం పవన్ చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'లో నటిస్తున్న రాశి
  • మార్చి 26న విడుదల కానున్న చిత్రం
'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమైన రాశీ ఖన్నా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. చివరిగా సిద్ధు జొన్నలగడ్డ సరసన 'తెలుసు కదా' చిత్రంలో కనిపించింది. ఈ సినిమాలో రాశీ ఖన్నాకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఆమె పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన 'ఉస్తాద్ భగత్ సింగ్'లో నటిస్తోంది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మార్చి 26న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో శ్రీలీల కూడా హీరోయిన్ గా నటిస్తోంది. 

మరోవైపు, రాశీ ఖన్నా తాజాగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో బ్లాక్ అవుట్ ఫిట్ తో, బ్లాక్ పెండెంట్ ఉన్న చైన్ తో రాశి బోల్డ్ గా కనిపిస్తోంది. ఈ ఫొటోలకు 'ఇది భ్రమల ప్యాలెస్' అంటూ క్యాప్షన్ పెట్టింది. 






More Telugu News