వరల్డ్ కప్ బనారస్ చీరలు... వివరాలు ఇవిగో!
- భారత క్రికెటర్ల కుటుంబాలకు ప్రత్యేకంగా బెనారస్ చీరలను తయారు చేస్తున్న వారణాసి చేనేతలు
- ప్రత్యేక డిజైన్లలో చీరలను తయారు చేస్తున్న వైనం
- ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పంపిణికి చర్యలు
టీ20 ప్రపంచకప్కు భారత జట్టు సిద్ధమవుతున్న వేళ.. వారణాసి నుంచి టీమ్ ఇండియాకు ప్రత్యేక గౌరవం దక్కనుంది. పవిత్ర నగరమైన బెనారస్లోని నేత కార్మికులు భారత క్రికెటర్ల కుటుంబాల కోసం ప్రత్యేకంగా బెనారస్ చీరలను తయారు చేస్తున్నారు. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా సంప్రదాయ చేనేత కళకు మరింత గుర్తింపు రావడంతో పాటు.. జాతీయ గర్వాన్ని ప్రతిబింబించేలా ఈ చీరలు రూపుదిద్దుకుంటున్నాయి.
బనారసి చీరల తయారీలో నైపుణ్యం కలిగిన నేతలు ఇప్పుడు క్రికెట్ స్ఫూర్తిని కూడా తమ కళలో మిళితం చేస్తున్నారు. సాధారణంగా పెళ్లిళ్లు, పండుగలు వంటి సందర్భాల్లో మాత్రమే కనిపించే బెనారస్ చీరలు.. ఈసారి క్రికెట్ అభిమానాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక డిజైన్లతో రూపొందుతున్నాయి.
ఈ చీరలపై ట్రోఫీలు, బ్యాట్ -బాల్ గుర్తులు, అలాగే 1992, 1996,2015 (మహిళల వరల్డ్కప్), 2024 వంటి కీలక టోర్నమెంట్ సంవత్సరాలను ప్రత్యేక మోటిఫ్ల రూపంలో నేసి చూపిస్తున్నారు. దీంతో ఇవి కేవలం చీరలు కాకుండా.. భారత క్రికెట్ చరిత్రను చెప్పే కళాఖండాలుగా మారుతున్నాయి.
ఈ కార్యక్రమానికి ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ ముందుకొచ్చింది. చీరల తయారీ, పంపిణీ ద్వారా స్థానిక నేత కార్మికులకు ప్రత్యక్ష ఉపాధి కల్పించడంతో పాటు.. వారి శ్రమకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చర్యలు చేపట్టింది.
క్రికెటర్లు మైదానంలో దేశానికి గెలుపు అందిస్తుంటే.. వారి వెనుక నిలిచే కుటుంబాలకు ఈ బహుమతి అందించడం ఒక భావోద్వేగ గౌరవంగా మారింది. టీమ్ ఇండియా ప్రయాణంలో కుటుంబాల పాత్రను గుర్తించి.. వారణాసి ఈ చీరల రూపంలో ప్రత్యేక గౌరవం అందిస్తోంది.
బనారసి చీరల తయారీలో నైపుణ్యం కలిగిన నేతలు ఇప్పుడు క్రికెట్ స్ఫూర్తిని కూడా తమ కళలో మిళితం చేస్తున్నారు. సాధారణంగా పెళ్లిళ్లు, పండుగలు వంటి సందర్భాల్లో మాత్రమే కనిపించే బెనారస్ చీరలు.. ఈసారి క్రికెట్ అభిమానాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక డిజైన్లతో రూపొందుతున్నాయి.
ఈ చీరలపై ట్రోఫీలు, బ్యాట్ -బాల్ గుర్తులు, అలాగే 1992, 1996,2015 (మహిళల వరల్డ్కప్), 2024 వంటి కీలక టోర్నమెంట్ సంవత్సరాలను ప్రత్యేక మోటిఫ్ల రూపంలో నేసి చూపిస్తున్నారు. దీంతో ఇవి కేవలం చీరలు కాకుండా.. భారత క్రికెట్ చరిత్రను చెప్పే కళాఖండాలుగా మారుతున్నాయి.
ఈ కార్యక్రమానికి ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ ముందుకొచ్చింది. చీరల తయారీ, పంపిణీ ద్వారా స్థానిక నేత కార్మికులకు ప్రత్యక్ష ఉపాధి కల్పించడంతో పాటు.. వారి శ్రమకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చర్యలు చేపట్టింది.
క్రికెటర్లు మైదానంలో దేశానికి గెలుపు అందిస్తుంటే.. వారి వెనుక నిలిచే కుటుంబాలకు ఈ బహుమతి అందించడం ఒక భావోద్వేగ గౌరవంగా మారింది. టీమ్ ఇండియా ప్రయాణంలో కుటుంబాల పాత్రను గుర్తించి.. వారణాసి ఈ చీరల రూపంలో ప్రత్యేక గౌరవం అందిస్తోంది.