'యుఫోరియా' సందడి.. రిలీజ్‌కు ముందు స్పెషల్ ప్రీమియర్ షో

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన కొత్త చిత్రం 'యుఫోరియా'. షాకింగ్ నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ఫిబ్రవరి 6వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే, విడుదలకు ఒక రోజు ముందే, అంటే ఫిబ్రవరి 5న, చిత్ర బృందం ప్రేక్షకుల కోసం ఒక ప్రత్యేక ప్రీమియర్ షోను ఏర్పాటు చేసింది.

హైదరాబాద్‌లోని మైత్రీ విమల్ 70MM థియేటర్‌లో ఫిబ్రవరి 5వ తేదీ సాయంత్రం 7:30 గంటలకు ఈ స్పెషల్ ప్రీమియర్ ప్రదర్శన జరగనుంది. ఈ షోకు 'యుఫోరియా' చిత్ర బృందం హాజరై ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించనుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమాకు గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ, యుక్త గుణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. 'యుఫోరియా'లో భూమిక చావ్లా, గౌతమ్ మీనన్, సారా అర్జున్, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది.


More Telugu News