అత్యాచార నిందితుడ్ని కోర్టు ఆవరణలో చితకబాదిన న్యాయవాదులు... వీడియో వైరల్

  • మైనర్‌పై అత్యాచారం, బ్లాక్ మెయిల్... నిందితుడిపై భోపాల్ కోర్టులో దాడి
  • పోలీసులకు, న్యాయవాదులకు మధ్య తోపులాట, ఉద్రిక్తత
  • వీడియోతో బ్లాక్ మెయిల్ చేసి నిందితుడు డబ్బు వసూలు చేసినట్టు ఆరోపణ
  • నిందితుడిని కస్టడీలోకి తీసుకుని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
భోపాల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మైనర్ బాలికపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్ కేసులో అరెస్టయిన నిందితుడిని పోలీసులు కోర్టుకు తీసుకురాగా, ఆగ్రహంతో ఉన్న కొందరు న్యాయవాదులు, ప్రజలు అతడిపై దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.

వివరాల్లోకి వెళితే, కోహెఫిజా ప్రాంతంలో 11వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసిన కేసులో ఒసాఫ్ అలీ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. మంగళవారం అతడిని కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకురాగా, అప్పటికే అక్కడ గుమిగూడిన కొందరు న్యాయవాదులు అతడిని చితకబాదారు. పోలీసులు నిందితుడిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ గందరగోళంతో కోర్టు కార్యకలాపాలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ఎట్టకేలకు అతికష్టమ్మీద పోలీసులు నిందితుడిని కోర్టు లోపలికి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

గతేడాది జూలైలో నిందితుడు తనపై అత్యాచారం చేశాడని, ఆ సమయంలో రహస్యంగా వీడియో తీసి దానిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియో బయటపెట్టకుండా ఉండాలంటే లక్ష రూపాయలు డిమాండ్ చేయగా, భయంతో రూ. 40,000 ఇచ్చినట్లు తెలిపింది. అంతేకాకుండా, తన ఇష్టానికి విరుద్ధంగా ఇస్లామిక్ ప్రార్థనలు చేయమని బలవంతం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. 

పోలీసులు నిందితుడిని కస్టడీలోకి తీసుకుని, అతడి మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలి స్నేహితురాలి ద్వారా నిందితుడికి ఆమెతో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు.


More Telugu News

Osaf Ali Khan Bhopal Bhopal court minor girl rape case court attack blackmail case lawyers attack crime news viral video Madhya Pradesh