అది ప్రభుత్వ నిర్ణయం.. మేం చేయగలిగింది ఏమీ లేదు: పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్‌ అలీ అఘా

  • టీ20 వరల్డ్ కప్ లో ఇండియాతో ఆడబోమన్న పాకిస్థాన్
  • ప్రభుత్వం, పీసీబీ తీసుకున్న నిర్ణయాన్ని తాము పాటించాల్సిందేనన్న సల్మాన్ అఘా
  • ఈరోజు సమావేశం కాబోతున్న ఐసీసీ
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ నెల 15న శ్రీలంకలోని కొలంబోలో ఇండియా - పాకిస్థాన్ దేశాల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్టు పాకిస్థాన్ తెలిపింది. 

ఈ సందర్భంగా పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా స్పందిస్తూ... ఈ నిర్ణయాన్ని తమ ప్రభుత్వం, పీసీబీ తీసుకున్నాయని... ఈ విషయంలో ఆటగాళ్లుగా తాము చేయగలిగింది ఏమీ లేదని చెప్పాడు. ప్రభుత్వం, పీసీబీ తీసుకున్న నిర్ణయాన్ని తాము పాటించాల్సిందేనని, వాళ్లు చెబితేనే తాము వెళ్లగలమని తెలిపాడు. 

మరోవైపు ఈరోజు ఐసీసీ సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలో పాకిస్థాన్ పై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పాకిస్థాన్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే... పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో విదేశీ ఆటగాళ్లు పాల్గొనే విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఐసీసీ టోర్నమెంట్లను నిర్వహించే అవకాశాన్ని కూడా పాక్ కోల్పోయే ప్రమాదముంది. అంతేకాదు ప్రతి ఏటా ఐసీసీ నుంచి అందే రెవెన్యూ వాటాలు కూడా ఆగిపోయే అవకాశం ఉంది.


More Telugu News