ఇరాన్ బందర్ అబ్బాస్ పోర్టులో భారీ పేలుడు

ఇరాన్ నగరం బందర్ అబ్బాస్‌లోని ఒక భవనంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. నగరంలోని మోలెం బౌలేవార్డ్ ప్రాంతంలోని ఎనిమిది అంతస్తుల భవనంలో పేలుడు సంభవించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ పేలుడుకు భవనంతో పాటు పలు వాహనాలు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఈ పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ నేవీ కమాండర్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. స్థానిక మీడియా మాత్రం వాటిని ఖండించింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో ఈ పేలుడు కలకలం రేపింది.

బందర్ అబ్బాస్ నౌకాశ్రయం హర్ముజ్ జలసంధిలో ఉంది. ఇరాన్, ఒమన్‌ల మధ్య ఇది కీలక జలమార్గం. ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతు ఈ మార్గం ద్వారానే సరఫరా అవుతుంది. గత ఏడాది ఏప్రిల్‌లో కూడా బందర్ అబ్బాస్ సమీపంలోని పోర్టులో భారీ పేలుడు సంభవించిన ఘటనలో వందలాదిమంది గాయపడినట్లు అప్పుడు వార్తలు వచ్చాయి.


More Telugu News