కోహ్లీ, రోహిత్లకు భారీ షాక్.. జీతాలకు కోత పెట్టనున్న బీసీసీఐ!
- సెంట్రల్ కాంట్రాక్టులను మార్చనున్న బీసీసీఐ
- విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు తగ్గనున్న జీతాలు
- అత్యున్నత ఏ+ కేటగిరీని రద్దు చేసే యోచనలో బోర్డు
- ఒకే ఫార్మాట్ ఆడే ఆటగాళ్లకు టాప్ గ్రేడ్ ఉండదని స్పష్టీకరణ
- ఇది పూర్తిగా క్రికెట్కు సంబంధించిన నిర్ణయమన్న బీసీసీఐ
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వార్షిక జీతాలకు భారీగా కోత పడనుంది. బీసీసీఐ తన సెంట్రల్ కాంట్రాక్టులను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించడమే ఇందుకు కారణం. ప్రస్తుతం అత్యున్నత ఏ+ గ్రేడ్లో ఉన్న వీరిద్దరినీ బీ కేటగిరీకి మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ ఒక్కో ఫార్మాట్కే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో అసలు ఏ+ కేటగిరీనే పూర్తిగా రద్దు చేయాలని బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మార్పులపై బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా స్పోర్ట్స్ స్టార్ తో మాట్లాడుతూ స్పష్టత ఇచ్చారు.
"ఈ ప్లాన్ను త్వరలోనే అమలు చేస్తాం. ఏ+ కేటగిరీకి అర్హులైన ఆటగాళ్లు ఇప్పుడు కేవలం ఒకే ఫార్మాట్లో ఆడుతున్నారు. ఏ+ కోసం మేము నిర్దేశించిన ప్రమాణాలను వారు అందుకోవడం లేదు. అందుకే ఆ కేటగిరీని తొలగిస్తున్నాం. ఇది పూర్తిగా క్రికెట్కు సంబంధించిన నిర్ణయమే. ఆటగాళ్లతో మాకు ఎలాంటి విభేదాలు లేవు" అని సైకియా స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం వ్యక్తిగత స్టార్డమ్ కంటే మూడు ఫార్మాట్లలోనూ ఆడే ఆటగాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్న బీసీసీఐ కొత్త విధానాన్ని సూచిస్తోంది. ప్రస్తుత కాంట్రాక్ట్ ప్రకారం ఏ+ కేటగిరీ ఆటగాళ్లు ఏడాదికి రూ. 7 కోట్లు, ఏ కేటగిరీ వారు రూ. 5 కోట్లు, బీ కేటగిరీ వారు రూ. 3 కోట్లు అందుకుంటున్నారు. ఈ మార్పు అమలైతే కోహ్లీ, రోహిత్ల జీతాలు భారీగా తగ్గుతాయి.
ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ ఒక్కో ఫార్మాట్కే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో అసలు ఏ+ కేటగిరీనే పూర్తిగా రద్దు చేయాలని బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మార్పులపై బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా స్పోర్ట్స్ స్టార్ తో మాట్లాడుతూ స్పష్టత ఇచ్చారు.
"ఈ ప్లాన్ను త్వరలోనే అమలు చేస్తాం. ఏ+ కేటగిరీకి అర్హులైన ఆటగాళ్లు ఇప్పుడు కేవలం ఒకే ఫార్మాట్లో ఆడుతున్నారు. ఏ+ కోసం మేము నిర్దేశించిన ప్రమాణాలను వారు అందుకోవడం లేదు. అందుకే ఆ కేటగిరీని తొలగిస్తున్నాం. ఇది పూర్తిగా క్రికెట్కు సంబంధించిన నిర్ణయమే. ఆటగాళ్లతో మాకు ఎలాంటి విభేదాలు లేవు" అని సైకియా స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం వ్యక్తిగత స్టార్డమ్ కంటే మూడు ఫార్మాట్లలోనూ ఆడే ఆటగాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్న బీసీసీఐ కొత్త విధానాన్ని సూచిస్తోంది. ప్రస్తుత కాంట్రాక్ట్ ప్రకారం ఏ+ కేటగిరీ ఆటగాళ్లు ఏడాదికి రూ. 7 కోట్లు, ఏ కేటగిరీ వారు రూ. 5 కోట్లు, బీ కేటగిరీ వారు రూ. 3 కోట్లు అందుకుంటున్నారు. ఈ మార్పు అమలైతే కోహ్లీ, రోహిత్ల జీతాలు భారీగా తగ్గుతాయి.