మధురాంతకంలో మోదీ భారీ సభ.. తమిళనాడు ఎన్డీయేతోనే ఉందన్న ప్రధాని
- తమిళనాడులో ఎన్డీయే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ
- అవినీతి డీఎంకే ప్రభుత్వానికి వీడ్కోలు పలకాలని పిలుపు
- మధురాంతకంలో ఎన్డీయే కూటమి భారీ బహిరంగ సభ
- హాజరుకానున్న అన్నాడీఎంకే, పీఎంకే, ఇతర మిత్రపక్షాల నేతలు
చెన్నై-తిండివనం హైవేపై ఉన్న మధురాంతకంలో ఈరోజు మధ్యాహ్నం జరగనున్న ఈ సభతో ఎన్డీయే తన ఎన్నికల సమరాన్ని అధికారికంగా ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి ఎన్డీయేలోని కీలక భాగస్వామ్య పక్షాలైన అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే, టీఎంసీ, ఏఎంఎంకే నేతలు హాజరుకానున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తారని అంచనా వేస్తున్నారు.
ప్రజా వ్యతిరేక డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ఈ సభలో పాల్గొంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఇప్పటికే తెలిపారు. ఎన్డీయే సుపరిపాలన, ప్రాంతీయ ఆకాంక్షలకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రజలను ఆకట్టుకుంటున్నాయని ప్రధాని తన పోస్టులో పేర్కొన్నారు. ఈ సభ ద్వారా కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఎన్డీయే భావిస్తోంది.