చిరంజీవి సినిమా టిక్కెట్ ధరల పెంపు... హైకోర్టులో పిటిషన్ దాఖలు
- తెలంగాణలో టిక్కెట్ ధరల పెంపునకు అనుమతి
- టిక్కెట్ ధరల పెంపుపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్
- కోర్టు పని దినాల్లో మాత్రమే పిటిషన్ దాఖలు చేయాలని పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
అయితే హౌస్ మోషన్ విచారణను హైకోర్టు నిరాకరించింది. కోర్టు పని దినాలలో మాత్రమే పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. దీంతో ఈ నెల 19న న్యాయవాది విజయ్ గోపాల్ మరోసారి పిటిషన్ దాఖలు చేయనున్నారు.
ఇదిలా ఉండగా, జనవరి 11న 'మన శంకర వరప్రసాద్ గారు' స్పెషల్ ప్రీమియర్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ షో టిక్కెట్ ధరను రూ.600గా నిర్ణయించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య షోను ప్రదర్శించాల్సి ఉంటుంది. జనవరి 12వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు సింగిల్ స్క్రీన్లో రూ.50, మల్టీప్లెక్స్లలో రూ.100 టిక్కెట్ ధర పెంచుకునే అవకాశం కల్పించింది.