'రో-కో' రీలోడెడ్.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన బీసీసీఐ
న్యూజిలాండ్తో రేపటి నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వడోదరాలో భారత ఆటగాళ్లు కఠోర సాధన చేశారు. ఈ ప్రాక్టీస్ సెషన్లో స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
బ్యాటింగ్, ఫీల్డింగ్, క్యాచింగ్ విభాగాల్లో ఈ ఇద్దరు సీనియర్లు తీవ్రంగా శ్రమించారు. నెట్స్లో భారీ షాట్లు ఆడుతూ చెమటోడ్చారు. రోహిత్, కోహ్లీ ప్రాక్టీస్కు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్కే పరిమితమైన ఈ ద్వయం, ఇటీవల ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్లలో అద్భుతంగా రాణించింది. కివీస్తో సిరీస్లోనూ అదే జోరును కొనసాగించి జట్టుకు విజయాలు అందించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
బ్యాటింగ్, ఫీల్డింగ్, క్యాచింగ్ విభాగాల్లో ఈ ఇద్దరు సీనియర్లు తీవ్రంగా శ్రమించారు. నెట్స్లో భారీ షాట్లు ఆడుతూ చెమటోడ్చారు. రోహిత్, కోహ్లీ ప్రాక్టీస్కు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్కే పరిమితమైన ఈ ద్వయం, ఇటీవల ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్లలో అద్భుతంగా రాణించింది. కివీస్తో సిరీస్లోనూ అదే జోరును కొనసాగించి జట్టుకు విజయాలు అందించాలని అభిమానులు ఆశిస్తున్నారు.