Hamtramck: అమెరికాలో మొట్టమొదటి ముస్లిం మెజారిటీ నగరం.. వీధికి ఖలీదా జియా పేరు
- విభిన్నమైన గుర్తింపును సొంతం చేసుకున్న హ్యామ్ట్రామ్క్ నగరం
- ఒకప్పుడు పోలాండ్ వలసదారులకు నిలయం
- ఇప్పుడు 70 శాతం మంది ముస్లింలే
- మేయర్, పోలీస్ చీఫ్, కౌన్సిల్ సభ్యులందరూ ముస్లింలే
డెట్రాయిట్ మధ్యలో ఉన్న హ్యామ్ట్రామ్క్ నగరం అమెరికా రాజకీయ సామాజిక చిత్రపటంలో ఒక విభిన్నమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఒకప్పుడు పోలిష్ వలసదారులకు నిలయంగా ఉన్న ఈ నగరం నేడు అమెరికాలోనే మొట్టమొదటి ముస్లిం మెజారిటీ నగరంగా అవతరించింది.
మిచిగాన్ రాష్ట్రంలోని వేన్ కౌంటీలో ఉన్న ఈ నగరం 1900ల ప్రారంభంలో జర్మన్-అమెరికన్ రైతుల నివాసంగా ఉండేది. 1914లో డాడ్జ్ ఆటోమొబైల్ ఫ్యాక్టరీ ప్రారంభం కావడంతో వేలాది మంది కార్మికులు ఇక్కడికి తరలివచ్చారు. ముఖ్యంగా 20వ శతాబ్దంలో పోలిష్ (పోలాండ్) వలసదారులకు ఇది ప్రధాన కేంద్రంగా మారింది.
20వ శతాబ్దం చివరలో డెట్రాయిట్ పారిశ్రామికంగా దెబ్బతినడం, స్థానిక పోలిష్ జనాభా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లడంతో హ్యామ్ట్రామ్క్ జనాభా తగ్గింది. అయితే, 1990ల నుంచి యెమెన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి ముస్లిం వలసదారులు ఇక్కడికి రావడం మొదలైంది. తక్కువ ధరకే ఇళ్లు లభించడం, ఉద్యోగ అవకాశాలు ఉండటంతో ఈ కమ్యూనిటీ వేగంగా విస్తరించింది.
జనాభా గణాంకాలు (2020 సెన్సస్ ప్రకారం)
మొత్తం జనాభా: 28,433
ముస్లిం జనాభా: సుమారు 70 శాతం
విదేశాల్లో జన్మించిన వారు: 40 శాతం కంటే ఎక్కువ
ప్రధాన సమూహాలు: యెమెన్ (అరబ్), బంగ్లాదేశ్ (ఆసియన్) సంతతి వారు
హ్యామ్ట్రామ్క్ చరిత్రలో కొన్ని కీలక మైలురాళ్లు
2013: అమెరికాలోనే మొదటి ముస్లిం మెజారిటీ నగరంగా గుర్తింపు
2015: నగర పాలక మండలి (సిటీ కౌన్సిల్)లో ముస్లింలు మెజారిటీ స్థానాలను గెలుచుకున్నారు
2022: అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి ఆల్-ముస్లిం సిటీ కౌన్సిల్ (అందరూ ముస్లిం సభ్యులే) ఇక్కడ ఏర్పాటైంది ప్రస్తుతం మేయర్, పోలీస్ చీఫ్ మరియు కౌన్సిల్ సభ్యులందరూ ముస్లింలే
ఖలీదా జియా వీధి నామకరణం
ఇటీవల హ్యామ్ట్రామ్క్ కౌన్సిల్, తన పరిధిలోని 'కార్పెంటర్ స్ట్రీట్' లో కొంత భాగాన్ని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా పేరుతో మార్చాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను కౌన్సిల్లోని బంగ్లాదేశ్ సంతతికి చెందిన నలుగురు కౌన్సిలర్లు చొరవ తీసుకుని ఆమోదింపజేశారు. గతంలో ఇదే విధంగా షికాగోలో ఖలీదా జియా భర్త, దివంగత బంగ్లాదేశ్ అధ్యక్షుడు జియావుర్ రెహ్మాన్ పేరును ఒక వీధికి పెట్టారు.
జీవనశైలి.. మార్పులు
నగరంలో ఒకప్పుడు పోలిష్ సంస్కృతికి చిహ్నాలుగా ఉన్న హోటళ్లు, దుకాణాలు ఇప్పుడు అరబిక్, బెంగాలీ రెస్టారెంట్లుగా మారిపోయాయి. సిటీ హాల్ వద్ద సైన్ బోర్డులు ఇంగ్లిష్తో పాటు అరబిక్, బెంగాలీ భాషల్లో కనిపిస్తాయి. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఇక్కడి ప్రజలు తమ పిల్లల భవిష్యత్తు కోసం కలిసిమెలిసి జీవిస్తున్నారని స్థానికులు చెబుతుంటారు. "ఒకప్పుడు పోలిష్ ప్రజలు వచ్చినప్పుడు కూడా పేర్లు మార్చారు, ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ అదే చేస్తోంది" అని స్థానిక చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.
మిచిగాన్ రాష్ట్రంలోని వేన్ కౌంటీలో ఉన్న ఈ నగరం 1900ల ప్రారంభంలో జర్మన్-అమెరికన్ రైతుల నివాసంగా ఉండేది. 1914లో డాడ్జ్ ఆటోమొబైల్ ఫ్యాక్టరీ ప్రారంభం కావడంతో వేలాది మంది కార్మికులు ఇక్కడికి తరలివచ్చారు. ముఖ్యంగా 20వ శతాబ్దంలో పోలిష్ (పోలాండ్) వలసదారులకు ఇది ప్రధాన కేంద్రంగా మారింది.
20వ శతాబ్దం చివరలో డెట్రాయిట్ పారిశ్రామికంగా దెబ్బతినడం, స్థానిక పోలిష్ జనాభా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లడంతో హ్యామ్ట్రామ్క్ జనాభా తగ్గింది. అయితే, 1990ల నుంచి యెమెన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి ముస్లిం వలసదారులు ఇక్కడికి రావడం మొదలైంది. తక్కువ ధరకే ఇళ్లు లభించడం, ఉద్యోగ అవకాశాలు ఉండటంతో ఈ కమ్యూనిటీ వేగంగా విస్తరించింది.
జనాభా గణాంకాలు (2020 సెన్సస్ ప్రకారం)
మొత్తం జనాభా: 28,433
ముస్లిం జనాభా: సుమారు 70 శాతం
విదేశాల్లో జన్మించిన వారు: 40 శాతం కంటే ఎక్కువ
ప్రధాన సమూహాలు: యెమెన్ (అరబ్), బంగ్లాదేశ్ (ఆసియన్) సంతతి వారు
హ్యామ్ట్రామ్క్ చరిత్రలో కొన్ని కీలక మైలురాళ్లు
2013: అమెరికాలోనే మొదటి ముస్లిం మెజారిటీ నగరంగా గుర్తింపు
2015: నగర పాలక మండలి (సిటీ కౌన్సిల్)లో ముస్లింలు మెజారిటీ స్థానాలను గెలుచుకున్నారు
2022: అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి ఆల్-ముస్లిం సిటీ కౌన్సిల్ (అందరూ ముస్లిం సభ్యులే) ఇక్కడ ఏర్పాటైంది ప్రస్తుతం మేయర్, పోలీస్ చీఫ్ మరియు కౌన్సిల్ సభ్యులందరూ ముస్లింలే
ఖలీదా జియా వీధి నామకరణం
ఇటీవల హ్యామ్ట్రామ్క్ కౌన్సిల్, తన పరిధిలోని 'కార్పెంటర్ స్ట్రీట్' లో కొంత భాగాన్ని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా పేరుతో మార్చాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను కౌన్సిల్లోని బంగ్లాదేశ్ సంతతికి చెందిన నలుగురు కౌన్సిలర్లు చొరవ తీసుకుని ఆమోదింపజేశారు. గతంలో ఇదే విధంగా షికాగోలో ఖలీదా జియా భర్త, దివంగత బంగ్లాదేశ్ అధ్యక్షుడు జియావుర్ రెహ్మాన్ పేరును ఒక వీధికి పెట్టారు.
జీవనశైలి.. మార్పులు
నగరంలో ఒకప్పుడు పోలిష్ సంస్కృతికి చిహ్నాలుగా ఉన్న హోటళ్లు, దుకాణాలు ఇప్పుడు అరబిక్, బెంగాలీ రెస్టారెంట్లుగా మారిపోయాయి. సిటీ హాల్ వద్ద సైన్ బోర్డులు ఇంగ్లిష్తో పాటు అరబిక్, బెంగాలీ భాషల్లో కనిపిస్తాయి. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఇక్కడి ప్రజలు తమ పిల్లల భవిష్యత్తు కోసం కలిసిమెలిసి జీవిస్తున్నారని స్థానికులు చెబుతుంటారు. "ఒకప్పుడు పోలిష్ ప్రజలు వచ్చినప్పుడు కూడా పేర్లు మార్చారు, ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ అదే చేస్తోంది" అని స్థానిక చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.