Andhra Pradesh: ఏపీలో మద్యం ధరల పెంపు.. బార్లపై అదనపు సుంకం రద్దు
- బార్లపై అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకం (ఏఆర్ఈటీ) రద్దు
- క్వార్టర్, బీర్లు మినహా ఇతర మద్యం బాటిళ్లపై రూ.10 పెంపు
- రిటైలర్ల మార్జిన్ను 1 శాతం పెంచుతూ కేబినెట్ నిర్ణయం
- ఈ మార్పులతో ప్రభుత్వానికి రూ.506 కోట్ల అదనపు ఆదాయం అంచనా
- కొత్తగా మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం విధానంలో కీలక మార్పులు చేసింది. బార్లపై విధిస్తున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకం (ఏఆర్ఈటీ)ను రద్దు చేస్తూ, అదే సమయంలో కొన్ని రకాల మద్యం ధరలను పెంచుతూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రిమండలి సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.
తాజా నిర్ణయం ప్రకారం సామాన్యులు ఎక్కువగా వినియోగించే రూ.99 ఎంఆర్పీ (180ఎంఎల్) క్వార్టర్ బాటిళ్లు, బీర్లు, వైన్, రెడీ టూ డ్రింక్స్ (ఆర్టీడీ) ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. వీటిని మినహాయించి, మిగతా అన్ని సైజుల మద్యం బాటిళ్ల ఎంఆర్పీపై రూ.10 పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం షాపులు, బార్ల మధ్య దిగుమతి ధరల్లో ఉన్న వ్యత్యాసాన్ని తొలగించి, ఒకే ధరకు మద్యం అమ్మేలా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఏఆర్ఈటీని రద్దు చేయడం వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.340 కోట్ల ఆదాయ నష్టం వాటిల్లుతుందని అంచనా. అయితే, మద్యం ధరలను పెంచడం ద్వారా ఈ నష్టాన్ని భర్తీ చేయడంతో పాటు అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్పులన్నింటి ద్వారా ప్రభుత్వ ఖజానాకు అదనంగా రూ.506 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు మద్యం షాపుల లైసెన్సీలకు ఎమ్మార్పీపై మార్జిన్ను ఒక శాతం పెంచే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
అలాగే, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధికి వెలుపల, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రీస్టార్ లేదా అంతకంటే ఎక్కువ స్థాయి హోటళ్లలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయాలతో రాష్ట్రంలో మద్యం అమ్మకాల విధానంలో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి.
తాజా నిర్ణయం ప్రకారం సామాన్యులు ఎక్కువగా వినియోగించే రూ.99 ఎంఆర్పీ (180ఎంఎల్) క్వార్టర్ బాటిళ్లు, బీర్లు, వైన్, రెడీ టూ డ్రింక్స్ (ఆర్టీడీ) ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. వీటిని మినహాయించి, మిగతా అన్ని సైజుల మద్యం బాటిళ్ల ఎంఆర్పీపై రూ.10 పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం షాపులు, బార్ల మధ్య దిగుమతి ధరల్లో ఉన్న వ్యత్యాసాన్ని తొలగించి, ఒకే ధరకు మద్యం అమ్మేలా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఏఆర్ఈటీని రద్దు చేయడం వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.340 కోట్ల ఆదాయ నష్టం వాటిల్లుతుందని అంచనా. అయితే, మద్యం ధరలను పెంచడం ద్వారా ఈ నష్టాన్ని భర్తీ చేయడంతో పాటు అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్పులన్నింటి ద్వారా ప్రభుత్వ ఖజానాకు అదనంగా రూ.506 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు మద్యం షాపుల లైసెన్సీలకు ఎమ్మార్పీపై మార్జిన్ను ఒక శాతం పెంచే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
అలాగే, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధికి వెలుపల, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రీస్టార్ లేదా అంతకంటే ఎక్కువ స్థాయి హోటళ్లలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయాలతో రాష్ట్రంలో మద్యం అమ్మకాల విధానంలో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి.