Nagababu: సన్నిహితులతో కలిసి జనసేన పార్టీకి విరాళం ఇచ్చిన నాగబాబు
- 'నా సేన కోసం నా వంతు'గా జనసేనకు నాగబాబు విరాళం
- తొలి విడతగా రూ. 48 లక్షల డీడీలు అందజేత
- మరో రూ. 2 లక్షలు కూడా త్వరలో అందిస్తామని వెల్లడి
- పవన్ కల్యాణ్ స్ఫూర్తితోనే ఈ విరాళం అని స్పష్టీకరణ
- పార్టీ కోశాధికారికి డీడీలు అందజేసిన నాగబాబు
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె. నాగబాబు పార్టీకి విరాళం అందజేశారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్ఫూర్తితో 'నా సేన కోసం నా వంతు' కార్యక్రమంలో భాగంగా 2026 నూతన సంవత్సరం సందర్భంగా ఆయన, తన సన్నిహితులతో కలిసి పార్టీకి రూ. 48 లక్షలు డీడీల రూపంలో అందించారు.
ఈ సందర్భంగా నాగబాబు స్పందిస్తూ... పవన్ కల్యాణ్ ప్రజలకు అందిస్తున్న సేవల్లో తాము సైతం భాగమవ్వాలని కోరుకుంటున్నామని, తమ వంతు సాయంగా ఈ విరాళం అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రూ. 48 లక్షలు ఇచ్చామని, త్వరలోనే మరో రూ. 2 లక్షలు కూడా అందించి, మొత్తం రూ. 50 లక్షలు సమకూరుస్తామని ఆయన వెల్లడించారు. తమ ఈ చిన్న సాయం పార్టీ కార్యకలాపాలకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
అనంతరం పార్టీ కోశాధికారి రత్నంకు నాగబాబు, ఆయన మిత్రులు డీడీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత సందీప్ పంచకర్ల, పార్టీ శ్రేయోభిలాషులు శ్రీనాథ్, కంద వెంకటేశ్వర రావు, బుల్లితెర నటుడు, బిగ్ బాస్ ఫేం భరణి, విజయ్, కల్కి రాజా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగబాబు స్పందిస్తూ... పవన్ కల్యాణ్ ప్రజలకు అందిస్తున్న సేవల్లో తాము సైతం భాగమవ్వాలని కోరుకుంటున్నామని, తమ వంతు సాయంగా ఈ విరాళం అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రూ. 48 లక్షలు ఇచ్చామని, త్వరలోనే మరో రూ. 2 లక్షలు కూడా అందించి, మొత్తం రూ. 50 లక్షలు సమకూరుస్తామని ఆయన వెల్లడించారు. తమ ఈ చిన్న సాయం పార్టీ కార్యకలాపాలకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
అనంతరం పార్టీ కోశాధికారి రత్నంకు నాగబాబు, ఆయన మిత్రులు డీడీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత సందీప్ పంచకర్ల, పార్టీ శ్రేయోభిలాషులు శ్రీనాథ్, కంద వెంకటేశ్వర రావు, బుల్లితెర నటుడు, బిగ్ బాస్ ఫేం భరణి, విజయ్, కల్కి రాజా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.