భారత్-బంగ్లా క్రికెట్ వైరం.. బీపీఎల్ నుంచి తప్పుకున్న భారత యాంకర్

Ridhima Pathak Withdraws from BPL Amid India Bangladesh Tensions
షార్ట్స్‌లో చూడండి
భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య రాజుకున్న వివాదం మరింత ముదురుతోంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్‌) యాంకరింగ్ ప్యానెల్ నుంచి భారత ప్రముఖ ప్రెజెంటర్ రిధిమ పాఠక్‌ను తొలగించారని వచ్చిన వార్తలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అయితే, ఈ వార్తలను రిధిమ ఖండించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తనంతట తానే ఈ టీ20 లీగ్ నుంచి వైదొలిగినట్లు ఆమె స్పష్టం చేశారు.

జనవరి 3న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌) జట్టు నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించడంతో ఈ వివాదం మొదలైంది. దీనికి ప్రతిగా బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించింది. టీ20 ప్రపంచకప్‌లో తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేసింది.

ఈ పరిణామాల మధ్య బీపీఎల్ నుంచి రిధిమను తొలగించారని బంగ్లాదేశ్ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా రిధిమ స్పందించారు. "నన్ను బీపీఎల్ నుంచి తొలగించారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. ఇది నేను వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం. దేశానికే నా తొలి ప్రాధాన్యం. క్రీడను ఏ ఒక్క అసైన్‌మెంట్‌ కన్నా ఎక్కువగా నేను గౌరవిస్తాను. నిజాయతీ, గౌరవం, క్రీడాస్ఫూర్తికి నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటాను" అని ఆమె పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ విషయంలో ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని ఆమె స్పష్టం చేశారు.
Go Back to Shorts
Ridhima Pathak
BPL
Bangladesh Premier League
India Bangladesh cricket
Mustafizur Rahman
BCCI
Kolkata Knight Riders
IPL Broadcast Ban
T20 World Cup

More Telugu News