Monica Jennifer: పాక్లో బలవంతపు మత మార్పిడులు... హిందూ, క్రిస్టియన్ యువతులే లక్ష్యం!
- పాక్లో మైనారిటీ వర్గాల అమ్మాయిల దయనీయ స్థితి
- మత మార్పిడి కేంద్రాలుగా దర్గాలు
- భయంతో పాకిస్థాన్లోని హిందూ, క్రిస్టియన్ కుటుంబాలు
పాకిస్థాన్లో మైనారిటీ వర్గాలకు చెందిన యువతుల బలవంతపు మత మార్పిడులు ఆందోళనకర స్థాయిలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హిందూ, క్రిస్టియన్ వర్గాల అమ్మాయిలనే లక్ష్యంగా చేసుకుని అపహరించి, బలవంతంగా ఇస్లాంలోకి మార్చి పెళ్లిళ్లు చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా రావల్పిండికి చెందిన 21 ఏళ్ల క్రిస్టియన్ యువతి మోనికా జెన్నిఫర్ ఉదంతం ఈ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.
గత నవంబర్లో మోనికా కిడ్నాప్ కు గురైంది. మోనికాను బలవంతంగా మతం మార్చారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, తాను ఇష్టపూర్వకంగానే ఇస్లాం స్వీకరించి, తన పొరుగింటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని మోనికా కోర్టుకు తెలపడం గమనార్హం. పాకిస్థాన్లో మైనర్ బాలికల వివాహాలను, తల్లిదండ్రుల అంగీకారం లేని పెళ్లిళ్లను చట్టం నిషేధించినప్పటికీ, కొందరు తీవ్రవాదులు షరియాను అడ్డం పెట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఓ పాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఆరోపణలను పాకిస్థాన్ సొంత జాతీయ బాలల హక్కుల కమిషన్ నివేదిక కూడా బలపరుస్తోంది. దేశంలో మైనారిటీ పిల్లలు 'వ్యవస్థీకృత వివక్ష'ను ఎదుర్కొంటున్నారని, బలవంతపు మత మార్పిడులు అత్యంత ఆందోళన కలిగించే అంశమని ఆ నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా సింధ్, దక్షిణ పంజాబ్ ప్రాంతాల్లో మైనారిటీ యువతులను అపహరించి, బెదిరించి, మతం మార్చి వయసులో బాగా పెద్దవారితో పెళ్లిళ్లు జరిపిస్తున్నారు.
సింధ్లోని ఉమర్కోట్ ప్రాంతంలో ఉన్న పీర్ సర్హందీ దర్గా, హిందూ యువతుల బలవంతపు మత మార్పిడులకు ప్రధాన కేంద్రంగా మారిందని 'వాయిస్ ఆఫ్ పాకిస్తాన్ మైనారిటీ' (వీఓపీఎమ్) అనే సంస్థ సంచలన ఆరోపణలు చేసింది. వేలాది మంది హిందూ యువతులను తానే స్వయంగా ఇస్లాంలోకి మార్చానని ఆ దర్గా మత గురువు పీర్ మహమ్మద్ అయుబ్ జాన్ సర్హందీ గర్వంగా ప్రకటించుకోవడం పరిస్థితికి నిదర్శనం.
యువతుల కుటుంబాలు చట్టపరంగా స్పందించేలోపే, దర్గాలోని మదర్సాలో వేగంగా మత మార్పిడి తంతు పూర్తిచేసి, దానికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నం చేస్తున్నారని వీఓపీఎమ్ సంస్థ ఆరోపించింది. ఈ ఘటనలపై ఐక్యరాజ్యసమితి పలుమార్లు పాకిస్తాన్ను విమర్శించినా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదు.
గత నవంబర్లో మోనికా కిడ్నాప్ కు గురైంది. మోనికాను బలవంతంగా మతం మార్చారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, తాను ఇష్టపూర్వకంగానే ఇస్లాం స్వీకరించి, తన పొరుగింటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని మోనికా కోర్టుకు తెలపడం గమనార్హం. పాకిస్థాన్లో మైనర్ బాలికల వివాహాలను, తల్లిదండ్రుల అంగీకారం లేని పెళ్లిళ్లను చట్టం నిషేధించినప్పటికీ, కొందరు తీవ్రవాదులు షరియాను అడ్డం పెట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఓ పాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఆరోపణలను పాకిస్థాన్ సొంత జాతీయ బాలల హక్కుల కమిషన్ నివేదిక కూడా బలపరుస్తోంది. దేశంలో మైనారిటీ పిల్లలు 'వ్యవస్థీకృత వివక్ష'ను ఎదుర్కొంటున్నారని, బలవంతపు మత మార్పిడులు అత్యంత ఆందోళన కలిగించే అంశమని ఆ నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా సింధ్, దక్షిణ పంజాబ్ ప్రాంతాల్లో మైనారిటీ యువతులను అపహరించి, బెదిరించి, మతం మార్చి వయసులో బాగా పెద్దవారితో పెళ్లిళ్లు జరిపిస్తున్నారు.
సింధ్లోని ఉమర్కోట్ ప్రాంతంలో ఉన్న పీర్ సర్హందీ దర్గా, హిందూ యువతుల బలవంతపు మత మార్పిడులకు ప్రధాన కేంద్రంగా మారిందని 'వాయిస్ ఆఫ్ పాకిస్తాన్ మైనారిటీ' (వీఓపీఎమ్) అనే సంస్థ సంచలన ఆరోపణలు చేసింది. వేలాది మంది హిందూ యువతులను తానే స్వయంగా ఇస్లాంలోకి మార్చానని ఆ దర్గా మత గురువు పీర్ మహమ్మద్ అయుబ్ జాన్ సర్హందీ గర్వంగా ప్రకటించుకోవడం పరిస్థితికి నిదర్శనం.
యువతుల కుటుంబాలు చట్టపరంగా స్పందించేలోపే, దర్గాలోని మదర్సాలో వేగంగా మత మార్పిడి తంతు పూర్తిచేసి, దానికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నం చేస్తున్నారని వీఓపీఎమ్ సంస్థ ఆరోపించింది. ఈ ఘటనలపై ఐక్యరాజ్యసమితి పలుమార్లు పాకిస్తాన్ను విమర్శించినా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదు.