Harmanpreet Kaur: విశాఖలో రెండో టీ20... టాస్ గెలిచిన టీమిండియా మహిళల జట్టు

Harmanpreet Kaur Wins Toss India Women Opt to Field
షార్ట్స్‌లో చూడండి
శ్రీలంకతో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సాధించాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ మ్యాచ్‌కు భారత జట్టులో ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. జ్వరం కారణంగా స్టార్ ఆల్‌రౌండర్, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బౌలర్ దీప్తి శర్మ ఆడటం లేదు. ఆమె స్థానంలో స్నేహ్ రాణా తుది జట్టులోకి వచ్చింది. ఈ విషయాన్ని హర్మన్‌ప్రీత్ ధృవీకరించింది. "దీప్తి ఆరోగ్యంగా లేదు, అందుకే స్నేహ్ రాణా ఆడుతోంది. గత మ్యాచ్‌లో బాగా ఆడాం, అదే వ్యూహంతో బరిలోకి దిగుతాం" అని ఆమె తెలిపింది. మరోవైపు, శ్రీలంక తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగుతోంది. తమ జట్టుపై పూర్తి నమ్మకం ఉందని, సానుకూలంగా ఆడతామని శ్రీలంక కెప్టెన్ చమరి అటపట్టు వెల్లడించింది.

ఇదే వేదికపై ఆదివారం జరిగిన తొలి టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో భారత బౌలర్లు శ్రీలంకను 121 పరుగులకే కట్టడి చేయగా, జెమీమా రోడ్రిగ్స్ (69 నాటౌట్) అద్భుత అర్ధ సెంచరీతో జట్టును గెలిపించింది.

భారత జట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ్ రాణా, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, వైష్ణవి శర్మ, శ్రీ చరణి.

శ్రీలంక జట్టు: చమరి అటపట్టు (కెప్టెన్), హసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, విష్మి గుణరత్నె, నీలాక్షిక సిల్వ, కౌషిని నుత్యంగన (వికెట్ కీపర్), కవిషా దిల్హారి, మల్కీ మదారా, ఇనోకా రణవీర, కావ్య కవింది, శశిని గిమ్హాని.
Go Back to Shorts
Harmanpreet Kaur
India Women vs Sri Lanka Women
India Women Cricket
Sri Lanka Women Cricket
Jemimah Rodrigues
Smriti Mandhana
Sneha Rana
Visakhapatnam T20
Women's T20 Series
Chamari Athapaththu

More Telugu News