ఆస్తి పన్ను చెల్లింపుపై నగరవాసులకు జీహెచ్ఎంసీ అదిరిపోయే శుభవార్త
- వన్ టైమ్ స్కీమ్ను ప్రకటించిన జీహెచ్ఎంసీ
- బకాయిలు ఒకేసారి చెల్లిస్తే వడ్డీపై 90 శాతం వరకు రాయితీ
- జీహెచ్ఎంసీలో ఇటీవల విలీనమైన మున్సిపాలిటీలకూ వర్తింపు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆస్తి పన్నుకు సంబంధించి సోమవారం ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లింపులపై వన్ టైమ్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. బకాయిలను ఒకేసారి చెల్లిస్తే వడ్డీపై 90 శాతం వరకు రాయితీ పొందవచ్చని నగరవాసులకు శుభవార్తను అందించింది.
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆస్తుల పెండింగ్ బకాయిలపై ఈ రాయితీ ఇవ్వబడుతుంది. వినియోగదారులు కేవలం ఆస్తి పన్నులో వడ్డీని 10 శాతం చెల్లిస్తే సరిపోతుందని జీహెచ్ఎంసీ తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని రకాల ప్రైవేటు మరియు ప్రభుత్వ ఆస్తులకు ఈ రాయితీ వర్తిస్తుందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలియజేశారు.
వారికీ వర్తింపు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరించిన విషయం తెలిసిందే. 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జీహెచ్ఎంసీలో విలీనమైన ప్రాంతాలకు కూడా ఈ ప్రత్యేక రాయితీ వర్తిస్తుంది. ఈ రాయితీ ద్వారా ప్రజలపై భారం తగ్గడంతో పాటు జీహెచ్ఎంసీకి గణనీయమైన ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆస్తుల పెండింగ్ బకాయిలపై ఈ రాయితీ ఇవ్వబడుతుంది. వినియోగదారులు కేవలం ఆస్తి పన్నులో వడ్డీని 10 శాతం చెల్లిస్తే సరిపోతుందని జీహెచ్ఎంసీ తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని రకాల ప్రైవేటు మరియు ప్రభుత్వ ఆస్తులకు ఈ రాయితీ వర్తిస్తుందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలియజేశారు.
వారికీ వర్తింపు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరించిన విషయం తెలిసిందే. 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జీహెచ్ఎంసీలో విలీనమైన ప్రాంతాలకు కూడా ఈ ప్రత్యేక రాయితీ వర్తిస్తుంది. ఈ రాయితీ ద్వారా ప్రజలపై భారం తగ్గడంతో పాటు జీహెచ్ఎంసీకి గణనీయమైన ఆదాయం సమకూరే అవకాశం ఉంది.