నారా లోకేశ్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో ఎంపీఎల్-4 పోటీలు... ప్రారంభించిన నారా బ్రహ్మణి
- నాలుగో సీజన్ లోకి అడుగుపెట్టిన మంగళగిరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు
- ప్రారంభోత్సవానికి విచ్చేసిన నారా బ్రహ్మణి
- కాసేపు బ్యాటింగ్ చేసిన లోకేశ్ అర్ధాంగి
గత మూడు సీజన్లులగా క్రికెట్ ప్రేమికులను అలరించిన మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్-4 నేడు అట్టహాసంగా ప్రారంభమైంది. ఏపీ మంత్రి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రహ్మణి ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. మంగళగిరిలోని నారా లోకేశ్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన బ్రహ్మణి... అనంతరం మైదానంలోకి దిగి టోర్నీ ప్రారంభించారు. బ్యాట్ చేతపట్టి షాట్లు కొట్టారు. ఓపెనింగ్ మ్యాచ్ ను కొద్దిసేపు వీక్షించారు.
ఈ కార్యక్రమానికి టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ బాబు, టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్థార్థ్ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను బ్రహ్మణి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఈ కార్యక్రమానికి టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ బాబు, టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్థార్థ్ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను బ్రహ్మణి సోషల్ మీడియాలో పంచుకున్నారు.