Chandrababu Naidu: రాష్ట్రవ్యాప్తంగా 'ముస్తాబు' కార్యక్రమం... తాళ్లపల్లిలో శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Launches Mustabu Program in Andhra Pradesh
షార్ట్స్‌లో చూడండి
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తనదే బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో అనకాపల్లి జిల్లా, తాళ్లపాలెంలో 'ముస్తాబు' కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రతి శనివారం అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

గురువారం తాళ్లపాలెంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ముచ్చటించి, 'ముస్తాబు' కార్యక్రమం ద్వారా వారు పాటిస్తున్న వ్యక్తిగత శుభ్రత విధానాలను స్వయంగా పరిశీలించారు. పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను వారికి వివరించారు.

ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, తాళ్లపాలెం గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కాలినడకన పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న స్వచ్ఛత పనులను పరిశీలించి, వారి సేవలను అభినందించారు.

అంతకుముందు, ముఖ్యమంత్రికి హెలిప్యాడ్ వద్ద స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తదితర టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Mustabu Program
Andhra Pradesh
Personal Hygiene
Student Hygiene
Government Schools
Private Schools
Tallapalem
Anakapalli District
Swachh Bharat

More Telugu News