ఒడిశాలో హోంగార్డు ఉద్యోగాలకు పోస్ట్ గ్రాడ్యుయేట్ల క్యూ.. నిరుద్యోగంపై రాజకీయ దుమారం
- ఒడిశాలో 187 హోంగార్డు పోస్టులకు భారీ పోటీ
- పరీక్షకు హాజరైన వారిలో ఎంబీఏ, ఎంసీఏ పట్టభద్రులు
- రాష్ట్రంలో నిరుద్యోగంపై బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించిన తృణమూల్
- రోజుకు రూ.639 జీతం ఉద్యోగానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ల దరఖాస్తు
వివరాల్లోకి వెళితే.. ఒడిశా పోలీస్ శాఖ మూడు రోజుల క్రితం, డిసెంబర్ 16న సంబల్పుర్లో హోంగార్డు పోస్టుల కోసం రాత పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు అభ్యర్థులు ఊహించని సంఖ్యలో తరలిరావడంతో వారిని అదుపు చేయడం అధికారులకు సవాలుగా మారింది. దీంతో ప్రత్యేక బలగాలను మోహరించడమే కాకుండా, డ్రోన్లతో పరిస్థితిని పర్యవేక్షించాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
ఈ ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ వ్యంగ్యంగా స్పందించింది. "రోజుకు కేవలం రూ.639 జీతం వచ్చే ఉద్యోగానికి పోస్ట్ గ్రాడ్యుయేట్లు పోటీ పడుతున్నారు. చేతిలో డిగ్రీలు ఉన్నా కొలువులు లేని దుస్థితి ఇది. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకొనే బీజేపీ ప్రభుత్వం పనితీరుకు ఇదే నిదర్శనం" అని తమ 'ఎక్స్' ఖాతాలో విమర్శించింది.