తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం... ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

  • పెద్ద శంకరంపేట మండలం కోలపల్లి గ్రామ సమీపంలో దుర్ఘటన
  • పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళుతుండగా ప్రమాదం
  • మృతులను కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల వాసులుగా గుర్తింపు
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెద్ద శంకరంపేట మండలం, కోలపల్లి గ్రామ సమీపంలో శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆ కుటుంబం హైదరాబాద్ నుంచి కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్ మండలం మాగీ గ్రామానికి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మృతులను లింగమయ్య, సాయమ్మ, సాయిలు, మానసలుగా గుర్తించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పెద్ద శంకరంపేట ఎస్సై ప్రవీణ్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


More Telugu News