నిజాంపేటలో రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
- కబ్జాదారుల నుంచి 10 ఎకరాలను స్వాధీనం చేసుకున్న హైడ్రా
- తాత్కాలిక షెడ్లు, ప్రహరీలను కూల్చివేసిన అధికారులు
- భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి బోర్డులు ఏర్పాటు
కొంతకాలంగా ఈ ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకుంటున్నారని స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా బృందం, రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. విచారణలో భూ కబ్జా వాస్తవమేనని నిర్ధారించుకున్న తర్వాత చర్యలకు ఉపక్రమించింది.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ చేపట్టారు. ఆక్రమణల తొలగింపులో భాగంగా, అక్కడ ఉన్న శాశ్వత నివాసాలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా, తాత్కాలికంగా నిర్మించిన షెడ్లు, ప్రహరీ గోడలను అధికారులు కూల్చివేశారు.
అనంతరం, స్వాధీనం చేసుకున్న 10 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టం చేస్తూ హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేసి, భూమికి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించారు.