Chandrababu Naidu: ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

Chandrababu Naidu Conducts Aerial Survey of Uttarandhra Projects
  • హెలికాప్టర్‌ ద్వారా నిర్మాణ పనుల పురోగతి పరిశీలన
  • భోగాపురం ఎయిర్‌పోర్ట్, జాతీయ రహదారి పనులపై ఆరా
  • విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టులపై అధికారులతో చర్చ
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకమైన పలు ప్రాజెక్టుల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పరిశీలించారు. శుక్రవారం ఆయన హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించి, పనుల పురోగతిని గగనతలం నుంచి వీక్షించారు. రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత ముఖ్యమైన ఈ ప్రాజెక్టులను వేగవంతం చేయాలనే లక్ష్యంతో ఈ పర్యటన సాగింది.

విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిధిలో నిర్మితమవుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, రాయ్‌పూర్-విశాఖ జాతీయ రహదారి, తీరప్రాంత రోడ్లు, పోర్టులు, ఐటీ కంపెనీల నిర్మాణాల పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్‌ నుంచే ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ముఖ్యంగా కనెక్టివిటీ ప్రాజెక్టుల పురోగతిపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఉత్తరాంధ్ర స్వరూపమే మారిపోతుందని, అభివృద్ధిలో కొత్త శకం ప్రారంభమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పనుల పురోగతిపై అధికారులతో చర్చించి, వారికి పలు సూచనలు చేసినట్లు సమాచారం.
Chandrababu Naidu
Uttarandhra projects
Aerial survey
Visakhapatnam
Bhogapuram airport
Raipur Visakhapatnam highway
Andhra Pradesh development
Connectivity projects
IT companies

More Telugu News