Indigo: ఇండిగో ప్రయాణికులకు ఊరట... రూ. 10,000 పరిహారం ప్రకటన
- విమానాల రద్దుతో ఇబ్బంది పడిన ప్రయాణికులకు ఇండిగో పరిహారం
- తీవ్రంగా నష్టపోయిన వారికి రూ. 10,000 విలువైన ట్రావెల్ వోచర్లు
- విమాన సర్వీసుల వైఫల్యంపై దర్యాప్తునకు బయటి నిపుణులు
- రద్దయిన విమానాలకు రిఫండ్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం
విమాన సర్వీసుల అంతరాయంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో గురువారం ఊరట కల్పించే ప్రకటన చేసింది. ఈ నెల ప్రారంభంలో విమానాల రద్దు, ఆలస్యం కారణంగా తీవ్రంగా నష్టపోయిన వారికి రూ. 10,000 విలువైన ట్రావెల్ వోచర్లను అందిస్తున్నట్లు తెలిపింది.
ఈ నెల 3 నుంచి 5వ తేదీ మధ్య దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు గంటల తరబడి చిక్కుకుపోయిన విషయాన్ని అంగీకరిస్తూ, జరిగిన అసౌకర్యానికి సంస్థ విచారం వ్యక్తం చేసింది. ఈ వోచర్లను రాబోయే 12 నెలల పాటు తమ భవిష్యత్ ప్రయాణాలకు ఉపయోగించుకోవచ్చని ఇండిగో ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన పరిహారానికి ఇది అదనమని స్పష్టం చేశారు. ఇప్పటికే రద్దయిన విమానాలకు సంబంధించిన రిఫండ్ల ప్రక్రియను ప్రారంభించినట్లు కూడా సంస్థ వెల్లడించింది.
మరోవైపు గత వారం చోటుచేసుకున్న భారీ వైఫల్యాలపై దర్యాప్తు చేసేందుకు బయటి సాంకేతిక నిపుణులను నియమించనున్నట్లు ఇండిగో ఛైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా తెలిపారు. సమస్య మూల కారణాలను గుర్తించి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ నెల 8 నుంచి అన్ని గమ్యస్థానాలకు సేవలను పునరుద్ధరించామని, 9 నుంచి కార్యకలాపాలు పూర్తిస్థాయిలో స్థిరపడ్డాయని ఇండిగో పేర్కొంది. సురక్షితమైన, నమ్మకమైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది.
ఈ నెల 3 నుంచి 5వ తేదీ మధ్య దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు గంటల తరబడి చిక్కుకుపోయిన విషయాన్ని అంగీకరిస్తూ, జరిగిన అసౌకర్యానికి సంస్థ విచారం వ్యక్తం చేసింది. ఈ వోచర్లను రాబోయే 12 నెలల పాటు తమ భవిష్యత్ ప్రయాణాలకు ఉపయోగించుకోవచ్చని ఇండిగో ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన పరిహారానికి ఇది అదనమని స్పష్టం చేశారు. ఇప్పటికే రద్దయిన విమానాలకు సంబంధించిన రిఫండ్ల ప్రక్రియను ప్రారంభించినట్లు కూడా సంస్థ వెల్లడించింది.
మరోవైపు గత వారం చోటుచేసుకున్న భారీ వైఫల్యాలపై దర్యాప్తు చేసేందుకు బయటి సాంకేతిక నిపుణులను నియమించనున్నట్లు ఇండిగో ఛైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా తెలిపారు. సమస్య మూల కారణాలను గుర్తించి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ నెల 8 నుంచి అన్ని గమ్యస్థానాలకు సేవలను పునరుద్ధరించామని, 9 నుంచి కార్యకలాపాలు పూర్తిస్థాయిలో స్థిరపడ్డాయని ఇండిగో పేర్కొంది. సురక్షితమైన, నమ్మకమైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది.