Ishaq Dar: భారత్ లేకుండా దక్షిణాసియాలో కొత్త కూటమికి పాక్ ప్రయత్నం.. ఏ దేశమూ ముందుకు రాదంటున్న విశ్లేషకులు!
- చైనా, బంగ్లాదేశ్తో ఉన్న బృందాన్ని విస్తరించేందుకు ప్రణాళిక
- నిర్వీర్యమైన 'సార్క్' స్థానంలో కొత్త వేదిక ఏర్పాటుపై దృష్టి
- భారత్ ఆర్థిక శక్తిని కాదని ఏ దేశం ముందుకు రాదంటున్న విశ్లేషకులు
దక్షిణాసియా రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న భారత్కు పోటీగా పాకిస్థాన్ సరికొత్త ఎత్తుగడకు తెరలేపింది. భారత్ను పూర్తిగా పక్కనపెట్టి, ఈ ప్రాంతంలో ఒక కొత్త కూటమిని ఏర్పాటు చేసేందుకు ఇస్లామాబాద్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చైనా, బంగ్లాదేశ్లతో ఇప్పటికే ఉన్న తమ త్రైపాక్షిక కూటమిని మరింత విస్తరించి, ఇతర దేశాలను కూడా చేర్చుకోవాలని చూస్తున్నట్లు పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఇటీవల వెల్లడించారు.
ఏళ్లుగా నిర్వీర్యంగా ఉన్న 'దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్)' స్థానంలో కొత్త ప్రాంతీయ కూటమి అవసరమని ఆయన నొక్కిచెప్పారు. విభజన రాజకీయాలకు స్వస్తి పలికి, పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో భారత్ వైఖరి కారణంగానే 'సార్క్' బలహీనపడిందని పరోక్షంగా విమర్శించారు. ఈ ఏడాది ఆరంభంలో పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్ కలిసి ఒక త్రైపాక్షిక వేదికను ఏర్పాటు చేశాయి. జూన్లో చైనాలోని కున్మింగ్లో తొలి సమావేశం కూడా జరిగింది. ఇప్పుడు దీనిని మరింత విస్తరించాలని పాక్ భావిస్తోంది.
అయితే, పాకిస్థాన్ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ వంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను, బలమైన సైనిక శక్తిని కాదని ఏ పొరుగు దేశం కూడా పాకిస్థాన్ కూటమిలో చేరే సాహసం చేయదని వారు స్పష్టం చేస్తున్నారు. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కంటే భారత్ ఆర్థిక వ్యవస్థ 12 రెట్లు పెద్దదని, విపత్కర సమయాల్లో పొరుగు దేశాలను ఆదుకోవడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని గుర్తుచేస్తున్నారు. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ దౌత్యం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సాయం వంటి అంశాల్లో భారత్ తన నాయకత్వ పటిమను నిరూపించుకుంది.
నేపాల్, భూటాన్ వంటి దేశాలు వాణిజ్యపరంగా పూర్తిగా భారత్పైనే ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో, భారత్ను దూరం పెట్టే ఏ కూటమి అయినా విజయవంతం కావడం కష్టమని, పాకిస్థాన్ ప్రయత్నం కేవలం ఆశావహంగానే మిగిలిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏళ్లుగా నిర్వీర్యంగా ఉన్న 'దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్)' స్థానంలో కొత్త ప్రాంతీయ కూటమి అవసరమని ఆయన నొక్కిచెప్పారు. విభజన రాజకీయాలకు స్వస్తి పలికి, పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో భారత్ వైఖరి కారణంగానే 'సార్క్' బలహీనపడిందని పరోక్షంగా విమర్శించారు. ఈ ఏడాది ఆరంభంలో పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్ కలిసి ఒక త్రైపాక్షిక వేదికను ఏర్పాటు చేశాయి. జూన్లో చైనాలోని కున్మింగ్లో తొలి సమావేశం కూడా జరిగింది. ఇప్పుడు దీనిని మరింత విస్తరించాలని పాక్ భావిస్తోంది.
అయితే, పాకిస్థాన్ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ వంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను, బలమైన సైనిక శక్తిని కాదని ఏ పొరుగు దేశం కూడా పాకిస్థాన్ కూటమిలో చేరే సాహసం చేయదని వారు స్పష్టం చేస్తున్నారు. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కంటే భారత్ ఆర్థిక వ్యవస్థ 12 రెట్లు పెద్దదని, విపత్కర సమయాల్లో పొరుగు దేశాలను ఆదుకోవడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని గుర్తుచేస్తున్నారు. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ దౌత్యం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సాయం వంటి అంశాల్లో భారత్ తన నాయకత్వ పటిమను నిరూపించుకుంది.
నేపాల్, భూటాన్ వంటి దేశాలు వాణిజ్యపరంగా పూర్తిగా భారత్పైనే ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో, భారత్ను దూరం పెట్టే ఏ కూటమి అయినా విజయవంతం కావడం కష్టమని, పాకిస్థాన్ ప్రయత్నం కేవలం ఆశావహంగానే మిగిలిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.