Revanth Reddy: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో 3,000 డ్రోన్లతో షో.. గిన్నిస్ రికార్డు
- ముగింపు వేడుకలో ఆకట్టుకున్న డ్రోన్ షో
- తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను వివరించే థీమ్లతో డ్రోన్ షో
- అబుదాబిలో 2,131 డ్రోన్లతో ప్రదర్శన.. అధిగమించిన తెలంగాణ రైజింగ్ డ్రోన్ షో
'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'లో భారీ డ్రోన్ షో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ సదస్సు ముగింపు వేడుకలో ఏర్పాటు చేసిన డ్రోన్ షో చూపరులందరినీ విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యాలను వివరిస్తూ ప్రత్యేక థీమ్లతో ఈ డ్రోన్ షోను రూపొందించారు.
గిన్నిస్ బుక్ రికార్డును నమోదు చేసేలా మొత్తం 3 వేల డ్రోన్లతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. గతంలో అబుదాబిలో 2,131 డ్రోన్లతో నిర్వహించిన ప్రదర్శన గిన్నిస్ బుక్ రికార్డును సాధించింది. ఇప్పుడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సులో ఆ రికార్డును అధిగమించేలా 3 వేల డ్రోన్లతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేయడం విశేషం.
ఈ కార్యక్రమానికి హాజరైన గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రికార్డు సర్టిఫికెట్ ను అందజేశారు. ముగింపు వేడుకల సందర్భంగా బాణాసంచా వెలుగులతో గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం శోభాయమానంగా వెలిగిపోయింది.
గిన్నిస్ బుక్ రికార్డును నమోదు చేసేలా మొత్తం 3 వేల డ్రోన్లతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. గతంలో అబుదాబిలో 2,131 డ్రోన్లతో నిర్వహించిన ప్రదర్శన గిన్నిస్ బుక్ రికార్డును సాధించింది. ఇప్పుడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సులో ఆ రికార్డును అధిగమించేలా 3 వేల డ్రోన్లతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేయడం విశేషం.
ఈ కార్యక్రమానికి హాజరైన గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రికార్డు సర్టిఫికెట్ ను అందజేశారు. ముగింపు వేడుకల సందర్భంగా బాణాసంచా వెలుగులతో గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం శోభాయమానంగా వెలిగిపోయింది.