Krithi Shetty: నా హోటల్ రూంలో ఒక ఆత్మ కనిపించింది: కృతి శెట్టి సంచలన వ్యాఖ్యలు
- కార్తి కొత్త సినిమాలో ఆత్మలతో మాట్లాడే పాత్రలో కృతి శెట్టి
- షూటింగ్కు ముందు రోజు రాత్రి హోటల్ గదిలో ఆత్మను చూశానన్న నటి
- లైట్ వేయగానే పెద్ద శబ్దంతో మాయమైందని వెల్లడి
- ఈ వింత అనుభవం తన పాత్రపై నమ్మకాన్ని పెంచిందని వ్యాఖ్య
యువ కథానాయిక కృతి శెట్టి తనకు ఎదురైన ఓ వింత అనుభవాన్ని పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి సరిగ్గా ముందు రోజు రాత్రి, తన హోటల్ గదిలో ఒక ఆత్మను చూశానని ఆమె వెల్లడించారు. తమిళ నటుడు కార్తి హీరోగా, నలన్ కుమారస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వా వాత్తియార్' చిత్రంలో కృతి శెట్టి నటిస్తున్నారు.
ఈ సినిమాలో ఆమె ఆత్మలతో మాట్లాడే ఒక జిప్సీ యువతి పాత్రను పోషిస్తున్నారు. ఈ పాత్ర గురించి మాట్లాడుతూ, "ఈ సినిమా షూటింగ్ మొదలవడానికి ముందు రోజు రాత్రి నాకో వింత అనుభవం ఎదురైంది. మా అమ్మతో కలిసి హోటల్ గదిలో ఉన్నప్పుడు ఒక ఆత్మ రూపాన్ని చూశాను. మేం లైట్ వేయగానే పెద్ద శబ్దం వచ్చి అది మాయమైంది. ఆ ఆత్మ నాకు సహాయం చేయడానికి వచ్చిందో లేక పాత్ర కోసం నేను చేస్తున్న సాధన వల్ల వచ్చిందో తెలియదు" అని కృతి తెలిపారు.
తనకు మొదటి నుంచి ఆత్మలపై నమ్మకం ఉందని ఆమె పేర్కొన్నారు. "నేను తుళు సంప్రదాయానికి చెందినదాన్ని. మేము మా పూర్వీకులను దేవతలుగా పూజిస్తాం. వారు ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతూ ఉంటారని నమ్ముతాం. ఇప్పుడు ఈ ఘటనతో ఆ నమ్మకం మరింత బలపడింది" అని వివరించారు. ఈ అనుభవం వల్ల సినిమాలో తాను పోషిస్తున్న పాత్రపై మరింత నమ్మకం కలిగిందని, నటనలో అది తనకు బాగా ఉపయోగపడిందని కృతి శెట్టి అన్నారు.
ఈ చిత్రంలో కార్తి పోలీస్ ఆఫీసర్గా నటిస్తుండగా, సత్యరాజ్, రాజ్ కిరణ్, ఆనంద్ రాజ్, కరుణాకరన్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాలో ఆమె ఆత్మలతో మాట్లాడే ఒక జిప్సీ యువతి పాత్రను పోషిస్తున్నారు. ఈ పాత్ర గురించి మాట్లాడుతూ, "ఈ సినిమా షూటింగ్ మొదలవడానికి ముందు రోజు రాత్రి నాకో వింత అనుభవం ఎదురైంది. మా అమ్మతో కలిసి హోటల్ గదిలో ఉన్నప్పుడు ఒక ఆత్మ రూపాన్ని చూశాను. మేం లైట్ వేయగానే పెద్ద శబ్దం వచ్చి అది మాయమైంది. ఆ ఆత్మ నాకు సహాయం చేయడానికి వచ్చిందో లేక పాత్ర కోసం నేను చేస్తున్న సాధన వల్ల వచ్చిందో తెలియదు" అని కృతి తెలిపారు.
తనకు మొదటి నుంచి ఆత్మలపై నమ్మకం ఉందని ఆమె పేర్కొన్నారు. "నేను తుళు సంప్రదాయానికి చెందినదాన్ని. మేము మా పూర్వీకులను దేవతలుగా పూజిస్తాం. వారు ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతూ ఉంటారని నమ్ముతాం. ఇప్పుడు ఈ ఘటనతో ఆ నమ్మకం మరింత బలపడింది" అని వివరించారు. ఈ అనుభవం వల్ల సినిమాలో తాను పోషిస్తున్న పాత్రపై మరింత నమ్మకం కలిగిందని, నటనలో అది తనకు బాగా ఉపయోగపడిందని కృతి శెట్టి అన్నారు.
ఈ చిత్రంలో కార్తి పోలీస్ ఆఫీసర్గా నటిస్తుండగా, సత్యరాజ్, రాజ్ కిరణ్, ఆనంద్ రాజ్, కరుణాకరన్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.