Peer Sarhandi: పాక్లో హిందూ బాలికలే లక్ష్యం.. మతమార్పిడి కేంద్రంగా మారిన సూఫీ దర్గా!
- పాక్లో బలవంతపు మతమార్పిడి కేంద్రంగా సూఫీ దర్గా
- హిందూ బాలికలే లక్ష్యంగా దారుణాలు
- వేలమందిని మతం మార్చామంటున్న దర్గా మత పెద్దలు
- కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. ఒకే తరహా వ్యూహం
- రాజకీయ అండతోనే దర్గా నిర్వాహకులకు రక్షణ
పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్సులో ఓ ప్రముఖ సూఫీ దర్గా, హిందూ బాలికల బలవంతపు మత మార్పిడులకు ప్రధాన కేంద్రంగా మారిందని మైనారిటీ హక్కుల సంస్థ ‘వాయిస్ ఆఫ్ పాకిస్థాన్ మైనారిటీ’ (VOPM) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా పేద, బలహీన వర్గాలకు చెందిన హిందూ బాలికలను లక్ష్యంగా చేసుకుని ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది.
ఉమర్కోట్ ప్రాంతంలోని పీర్ సర్హందీ దర్గా, హిందూ కుటుంబాలకు భయాన్ని సృష్టిస్తోందని VOPM తెలిపింది. ఈ ప్రాంతంలో హిందూ జనాభా 50 శాతానికి పైగా ఉన్నప్పటికీ, భీల్, మేఘ్వార్, కోహ్లీ వంటి వర్గాలకు చెందిన బాలికలను కిడ్నాప్ చేసి, బలవంతంగా ఇస్లాంలోకి మార్చుతున్నారని సంస్థ ఆరోపించింది. బాధితుల్లో 12 నుంచి 15 ఏళ్లలోపు మైనర్లు కూడా ఉన్నారని పేర్కొంది.
ఈ దర్గా మత పెద్ద పీర్ మహమ్మద్ అయుబ్ జాన్ సర్హందీ, అతని సోదరుడు పీర్ వలియుల్లా.. తాము వేలమంది హిందూ యువతుల మతం మార్చామని గర్వంగా ప్రకటించుకుంటున్నారని VOPM వెల్లడించింది. హిందూ బాలికలు అదృశ్యమవడం, ఆ తర్వాత దర్గాలో ప్రత్యక్షమవడం, అప్పటికే వారిని మతమార్పిడి చేసి ఓ ముస్లిం వ్యక్తితో వివాహం జరిపించడం వంటివి నిరంతరం జరుగుతున్నాయని తెలిపింది. దర్గాకు అనుబంధంగా ఉన్న గుల్జార్-ఇ-ఖలీల్ మదర్సా, వేగంగా మతమార్పిడులు చేసే కేంద్రంగా పనిచేస్తోందని విమర్శించింది. బాధితుల కుటుంబాలు స్పందించేలోపే చట్టపరమైన రక్షణ పొందేందుకు ఈ వ్యూహం అనుసరిస్తున్నారని పేర్కొంది.
స్థానిక రాజకీయ పార్టీలతో దర్గా నిర్వాహకులకు ఉన్న సంబంధాల వల్లే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని VOPM ఆరోపించింది. ఈ మతమార్పిడులు స్వచ్ఛందంగా జరుగుతున్నాయని దర్గా వర్గాలు చెబుతున్నప్పటికీ, బాలికలు అదృశ్యమవడం, హడావుడిగా వివాహాలు చేయడం వంటివి చూస్తే ఇది బలహీన హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకున్న వ్యవస్థీకృత దోపిడీ అని స్పష్టమవుతోందని నొక్కి చెప్పింది.
ఉమర్కోట్ ప్రాంతంలోని పీర్ సర్హందీ దర్గా, హిందూ కుటుంబాలకు భయాన్ని సృష్టిస్తోందని VOPM తెలిపింది. ఈ ప్రాంతంలో హిందూ జనాభా 50 శాతానికి పైగా ఉన్నప్పటికీ, భీల్, మేఘ్వార్, కోహ్లీ వంటి వర్గాలకు చెందిన బాలికలను కిడ్నాప్ చేసి, బలవంతంగా ఇస్లాంలోకి మార్చుతున్నారని సంస్థ ఆరోపించింది. బాధితుల్లో 12 నుంచి 15 ఏళ్లలోపు మైనర్లు కూడా ఉన్నారని పేర్కొంది.
ఈ దర్గా మత పెద్ద పీర్ మహమ్మద్ అయుబ్ జాన్ సర్హందీ, అతని సోదరుడు పీర్ వలియుల్లా.. తాము వేలమంది హిందూ యువతుల మతం మార్చామని గర్వంగా ప్రకటించుకుంటున్నారని VOPM వెల్లడించింది. హిందూ బాలికలు అదృశ్యమవడం, ఆ తర్వాత దర్గాలో ప్రత్యక్షమవడం, అప్పటికే వారిని మతమార్పిడి చేసి ఓ ముస్లిం వ్యక్తితో వివాహం జరిపించడం వంటివి నిరంతరం జరుగుతున్నాయని తెలిపింది. దర్గాకు అనుబంధంగా ఉన్న గుల్జార్-ఇ-ఖలీల్ మదర్సా, వేగంగా మతమార్పిడులు చేసే కేంద్రంగా పనిచేస్తోందని విమర్శించింది. బాధితుల కుటుంబాలు స్పందించేలోపే చట్టపరమైన రక్షణ పొందేందుకు ఈ వ్యూహం అనుసరిస్తున్నారని పేర్కొంది.
స్థానిక రాజకీయ పార్టీలతో దర్గా నిర్వాహకులకు ఉన్న సంబంధాల వల్లే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని VOPM ఆరోపించింది. ఈ మతమార్పిడులు స్వచ్ఛందంగా జరుగుతున్నాయని దర్గా వర్గాలు చెబుతున్నప్పటికీ, బాలికలు అదృశ్యమవడం, హడావుడిగా వివాహాలు చేయడం వంటివి చూస్తే ఇది బలహీన హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకున్న వ్యవస్థీకృత దోపిడీ అని స్పష్టమవుతోందని నొక్కి చెప్పింది.