మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కలిసిన కేరళ సివిల్ సప్లైస్ బృందం

Nadendla Manohar Meets Kerala Civil Supplies Team
  • మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కేరళ పౌరసరఫరాల బృందం సమావేశం
  • విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిసిన అధికారులు
  • రెండు రాష్ట్రాల మధ్య పౌరసరఫరాల విధానాలపై చర్చ
  • ధాన్యం కొనుగోళ్లు, సంస్కరణలపై కీలక సంప్రదింపులు
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కేరళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ప్రతినిధుల బృందం గురువారం సమావేశమైంది. కేరళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) జయకృష్ణ నేతృత్వంలోని ఈ బృందం, విజయవాడ కానూరులోని పౌరసరఫరాల భవన్‌లో మంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయింది.

ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో అమలవుతున్న పౌరసరఫరాల వ్యవస్థపై అధికారులు చర్చించారు. వినియోగదారులకు అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరచడం, ధాన్యం సేకరణ విధానాలు, సివిల్ సప్లైస్ రంగంలో చేపడుతున్న సంస్కరణలు వంటి కీలక అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఏపీలో అమలు చేస్తున్న విధానాలపై కేరళ అధికారులు ఆసక్తి కనబరిచినట్లు సమాచారం.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండీ ఢిల్లీ రావు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఆర్. గోవిందరావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Nadendla Manohar
Kerala Civil Supplies
Andhra Pradesh Civil Supplies
Civil Supplies Corporation
Jayakrishna MD
Delhi Rao
R Govinda Rao
Poura Sarabharala
Vijayawada
Grain Procurement

More Telugu News