Achchennaidu: అబద్ధాలకు అంబాసిడర్ జగన్ రెడ్డి: మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్
- మాజీ సీఎం జగన్పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు
- జగన్ ఐదేళ్ల పాలనలో రైతులను మోసం చేశారని ఆరోపణ
- తాము అధికారంలోకి వచ్చాకే ధాన్యం బకాయిలు, పరిహారం చెల్లించామన్న అచ్చెన్న
- రైతు సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలని జగన్కు సవాల్
మాజీ ముఖ్యమంత్రి జగన్ పై రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ను 'అబద్ధాల అంబాసిడర్' అని అభివర్ణించిన ఆయన, రైతు సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. జగన్ ప్రభుత్వంపై చేస్తున్న నీచ ఆరోపణలు, ఆయన ఐదేళ్ల అబద్ధపు పాలనపై ఆయనే బురద చల్లుకున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు స్పందిస్తూ, "జగన్ ఐదేళ్ల మోసపూరిత పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. రూ. 1,674 కోట్ల ధాన్యం బకాయిలు పెట్టి రైతుల హక్కులను తాకట్టు పెట్టారు. కష్టకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఆయన హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించడంలో కూడా విఫలమయ్యారు" అని ఆరోపించారు.
తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించిందని అచ్చెన్నాయుడు తెలిపారు. "మేము అధికారంలోకి రాగానే ధాన్యం బకాయిలను, రైతు ఆత్మహత్యల పరిహారాన్ని వెంటనే చెల్లించి బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చాం. కేవలం 18 నెలల్లోనే మద్దతు ధరల కోసం రైతుల కోసం రూ. 800 కోట్లు ఖర్చు చేసి అండగా నిలిచాం. రైతును రాజుగా చేసింది ఎవరో ప్రజలకు స్పష్టంగా తెలుసు" అని వివరించారు.
జగన్ అబద్ధాలు, తమ ప్రభుత్వ వాస్తవాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే రావాలని జగన్కు అచ్చెన్న సవాల్ విసిరారు.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు స్పందిస్తూ, "జగన్ ఐదేళ్ల మోసపూరిత పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. రూ. 1,674 కోట్ల ధాన్యం బకాయిలు పెట్టి రైతుల హక్కులను తాకట్టు పెట్టారు. కష్టకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఆయన హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించడంలో కూడా విఫలమయ్యారు" అని ఆరోపించారు.
తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించిందని అచ్చెన్నాయుడు తెలిపారు. "మేము అధికారంలోకి రాగానే ధాన్యం బకాయిలను, రైతు ఆత్మహత్యల పరిహారాన్ని వెంటనే చెల్లించి బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చాం. కేవలం 18 నెలల్లోనే మద్దతు ధరల కోసం రైతుల కోసం రూ. 800 కోట్లు ఖర్చు చేసి అండగా నిలిచాం. రైతును రాజుగా చేసింది ఎవరో ప్రజలకు స్పష్టంగా తెలుసు" అని వివరించారు.
జగన్ అబద్ధాలు, తమ ప్రభుత్వ వాస్తవాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే రావాలని జగన్కు అచ్చెన్న సవాల్ విసిరారు.