Cyberabad Police: హైదరాబాద్ కేంద్రంగా ఆస్ట్రేలియన్లకు టోపీ.. రూ.10 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు!
- హైదరాబాద్ మాదాపూర్లో నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టు
- ఆస్ట్రేలియన్ యాసలో మాట్లాడి విదేశీయులను మోసం చేస్తున్న ముఠా
- గత రెండేళ్లలో దాదాపు రూ.10 కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు
- తొమ్మిది మంది అరెస్ట్.. పరారీలో ఖమ్మంకు చెందిన ఇద్దరు సూత్రధారులు
- హవాలా, క్రిప్టో మార్గాల్లో భారత్కు అక్రమంగా డబ్బు తరలింపు
ఆస్ట్రేలియా పౌరులనే లక్ష్యంగా చేసుకొని, వారి యాసలోనే మాట్లాడుతూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న ఓ భారీ నకిలీ కాల్ సెంటర్ ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ‘రిడ్జ్ ఐటీ సొల్యూషన్స్’ పేరుతో నడుస్తున్న ఈ ఫేక్ కాల్ సెంటర్పై శనివారం దాడి చేసి తొమ్మిది మందిని అరెస్టు చేశారు. గత రెండేళ్లలో ఈ ముఠా సుమారు రూ.8 నుంచి రూ.10 కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఖమ్మం జిల్లాకు చెందిన ప్రవీణ్, ప్రకాశ్ అనే ఇద్దరు ప్రధాన సూత్రధారులు ఈ మోసానికి తెరలేపారు. ఆస్ట్రేలియన్ పౌరుల కంప్యూటర్ హ్యాక్ అయిందంటూ నకిలీ పాప్-అప్లు, ఈ-మెయిల్స్ పంపేవారు. బాధితులు అందులోని కస్టమర్ కేర్ నంబర్కు ఫోన్ చేయగానే, ఆ కాల్ హైదరాబాద్లోని ఈ ఫేక్ కాల్ సెంటర్కు కనెక్ట్ అయ్యేది. ఆస్ట్రేలియన్ యాసలో మాట్లాడటంలో ప్రత్యేక శిక్షణ పొందిన టెలీకాలర్లు, బాధితులను నమ్మించి వారి కంప్యూటర్ను రిమోట్ యాక్సెస్ తీసుకునేందుకు 'ఎనీడెస్క్' వంటి అప్లికేషన్లను ఇన్స్టాల్ చేయించేవారు.
ఆ తర్వాత బాధితుల ఆన్లైన్ బ్యాంకింగ్ ఖాతాల్లోకి లాగిన్ అయి, డబ్బును ఆస్ట్రేలియాలోనే నివసిస్తున్న కొందరు భారతీయ విద్యార్థుల ఖాతాలకు బదిలీ చేసేవారు. అక్కడి నుంచి హవాలా, క్రిప్టోకరెన్సీ మార్గాల ద్వారా ఆ డబ్బును భారత్కు తరలించేవారు. ఈ కేసులో ఖమ్మం పట్టణానికి చెందిన ఇద్దరు మేనేజర్లు, కోల్కతాకు చెందిన ఏడుగురు టెలీకాలర్లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారులు ప్రవీణ్, ప్రకాశ్ పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నారు.
ఈ దాడిలో 12 కంప్యూటర్లు, 21 మొబైల్ ఫోన్లు, ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల్లోని విద్యార్థులు, ఎన్నారైలు తమ బ్యాంకు ఖాతాలను ఎవరికీ ఇవ్వొద్దని, అద్దెకు అసలే ఇవ్వరాదని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి ఖాతాలు సైబర్ మోసాలకు, మనీలాండరింగ్కు వాడుకునే ప్రమాదం ఉందని సూచించారు.
ఖమ్మం జిల్లాకు చెందిన ప్రవీణ్, ప్రకాశ్ అనే ఇద్దరు ప్రధాన సూత్రధారులు ఈ మోసానికి తెరలేపారు. ఆస్ట్రేలియన్ పౌరుల కంప్యూటర్ హ్యాక్ అయిందంటూ నకిలీ పాప్-అప్లు, ఈ-మెయిల్స్ పంపేవారు. బాధితులు అందులోని కస్టమర్ కేర్ నంబర్కు ఫోన్ చేయగానే, ఆ కాల్ హైదరాబాద్లోని ఈ ఫేక్ కాల్ సెంటర్కు కనెక్ట్ అయ్యేది. ఆస్ట్రేలియన్ యాసలో మాట్లాడటంలో ప్రత్యేక శిక్షణ పొందిన టెలీకాలర్లు, బాధితులను నమ్మించి వారి కంప్యూటర్ను రిమోట్ యాక్సెస్ తీసుకునేందుకు 'ఎనీడెస్క్' వంటి అప్లికేషన్లను ఇన్స్టాల్ చేయించేవారు.
ఆ తర్వాత బాధితుల ఆన్లైన్ బ్యాంకింగ్ ఖాతాల్లోకి లాగిన్ అయి, డబ్బును ఆస్ట్రేలియాలోనే నివసిస్తున్న కొందరు భారతీయ విద్యార్థుల ఖాతాలకు బదిలీ చేసేవారు. అక్కడి నుంచి హవాలా, క్రిప్టోకరెన్సీ మార్గాల ద్వారా ఆ డబ్బును భారత్కు తరలించేవారు. ఈ కేసులో ఖమ్మం పట్టణానికి చెందిన ఇద్దరు మేనేజర్లు, కోల్కతాకు చెందిన ఏడుగురు టెలీకాలర్లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారులు ప్రవీణ్, ప్రకాశ్ పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నారు.
ఈ దాడిలో 12 కంప్యూటర్లు, 21 మొబైల్ ఫోన్లు, ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల్లోని విద్యార్థులు, ఎన్నారైలు తమ బ్యాంకు ఖాతాలను ఎవరికీ ఇవ్వొద్దని, అద్దెకు అసలే ఇవ్వరాదని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి ఖాతాలు సైబర్ మోసాలకు, మనీలాండరింగ్కు వాడుకునే ప్రమాదం ఉందని సూచించారు.