Bugamma: వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య... హైదరాబాదులో ఘటన
- మద్యం తాగి వేధిస్తున్న భర్తను హత్య చేసిన భార్య
- కుమారుడు, బంధువుతో కలిసి దారుణానికి పాల్పడిన మహిళ
- అడ్డుకోబోయిన కూతురిని గదిలో బంధించిన నిందితులు
రోజూ మద్యం తాగి వేధిస్తున్న భర్తను భార్య, కుమారుడు కలిసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన హైదరాబాద్లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘట్కేసర్లో జరిగింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, బోడుప్పల్ దేవేందర్ నగర్లో నివసించే బండారు అంజయ్య (55) ఓ ప్రైవేట్ పాఠశాలలో బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య బుగమ్మ, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే, అంజయ్య ప్రతిరోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యాపిల్లలను తీవ్రంగా వేధించేవాడు.
ఈ క్రమంలో గురువారం రాత్రి అంజయ్య తన భార్య బుగమ్మ, కుమారుడు రాజు, బంధువు శేఖర్తో కలిసి మద్యం తాగాడు. వేధింపులు తట్టుకోలేకపోయిన భార్య, కుమారుడు, బంధువు అర్ధరాత్రి సమయంలో అంజయ్య మెడకు టవల్ బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఈ దారుణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన అంజయ్య కుమార్తెను ఓ గదిలో బంధించారు.
అనంతరం జరిగిన విషయాన్ని కుమార్తె పోలీసులకు తెలియజేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, బోడుప్పల్ దేవేందర్ నగర్లో నివసించే బండారు అంజయ్య (55) ఓ ప్రైవేట్ పాఠశాలలో బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య బుగమ్మ, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే, అంజయ్య ప్రతిరోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యాపిల్లలను తీవ్రంగా వేధించేవాడు.
ఈ క్రమంలో గురువారం రాత్రి అంజయ్య తన భార్య బుగమ్మ, కుమారుడు రాజు, బంధువు శేఖర్తో కలిసి మద్యం తాగాడు. వేధింపులు తట్టుకోలేకపోయిన భార్య, కుమారుడు, బంధువు అర్ధరాత్రి సమయంలో అంజయ్య మెడకు టవల్ బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఈ దారుణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన అంజయ్య కుమార్తెను ఓ గదిలో బంధించారు.
అనంతరం జరిగిన విషయాన్ని కుమార్తె పోలీసులకు తెలియజేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.