Anagani Satya Prasad: తిరుపతిలో భారీ స్థాయిలో స్పిరిచ్యువల్ టౌన్ షిప్ నిర్మాణం
- తిరుపతిలో 600 ఎకరాల్లో భారీ ఆధ్యాత్మిక టౌన్షిప్
- రూ. 3,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న డెల్లా గ్రూప్
- 'వసుదైక కుటుంబం' పేరుతో ప్రాజెక్ట్ నిర్మాణం
- మంత్రి సత్యప్రసాద్ కు ప్రాజెక్టు వివరాలు వెల్లడించిన డెల్లా గ్రూప్ ప్రతినిధులు
- ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తానన్న మంత్రి అనగాని సత్యప్రసాద్
కలియుగ వైకుంఠం తిరుపతి నగరంలో భారీ ఆధ్యాత్మిక టౌన్షిప్ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. ప్రముఖ డెల్లా గ్రూప్ సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో రూ. 3,000 కోట్ల వ్యయంతో ఈ మెగా ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకొచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. డెల్లా గ్రూప్ ప్రతినిధులు మంత్రితో సమావేశమై ప్రాజెక్ట్ వివరాలను సమగ్రంగా వివరించారు.
‘వసుదైక కుటుంబం’ పేరుతో నిర్మించనున్న ఈ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ టౌన్షిప్లో అనేక ప్రత్యేకతలు ఉండనున్నాయి. దాదాపు 5 వేల ఏళ్ల హిందూ మత సాంస్కృతిక చరిత్రను ప్రతిబింబించేలా ప్రత్యేక ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు ధార్మిక అధ్యయనం, సాంస్కృతిక ప్రదర్శనలు, విద్య, వసతి, వినోదం వంటి సేవలను ఒకేచోట అందించనున్నట్లు తెలిపారు. ఇది కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రపంచానికి పరిచయం చేసే గ్లోబల్ వేదికగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.
ఈ ప్రతిపాదనపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సానుకూలంగా స్పందించారు. ఇంతటి భారీ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తోందని, టౌన్షిప్ నిర్మాణానికి అవసరమైన అనుమతులను వేగంగా మంజూరు చేసేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో కూడా చర్చిస్తానని ఆయన ప్రతినిధులకు భరోసా ఇచ్చారు.
ఈ మెగా టౌన్షిప్ పూర్తయితే తిరుపతికి సరికొత్త గుర్తింపు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆధ్యాత్మిక పర్యాటకం, అంతర్జాతీయ పెట్టుబడులు పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని భావిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
‘వసుదైక కుటుంబం’ పేరుతో నిర్మించనున్న ఈ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ టౌన్షిప్లో అనేక ప్రత్యేకతలు ఉండనున్నాయి. దాదాపు 5 వేల ఏళ్ల హిందూ మత సాంస్కృతిక చరిత్రను ప్రతిబింబించేలా ప్రత్యేక ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు ధార్మిక అధ్యయనం, సాంస్కృతిక ప్రదర్శనలు, విద్య, వసతి, వినోదం వంటి సేవలను ఒకేచోట అందించనున్నట్లు తెలిపారు. ఇది కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రపంచానికి పరిచయం చేసే గ్లోబల్ వేదికగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.
ఈ ప్రతిపాదనపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సానుకూలంగా స్పందించారు. ఇంతటి భారీ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తోందని, టౌన్షిప్ నిర్మాణానికి అవసరమైన అనుమతులను వేగంగా మంజూరు చేసేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో కూడా చర్చిస్తానని ఆయన ప్రతినిధులకు భరోసా ఇచ్చారు.
ఈ మెగా టౌన్షిప్ పూర్తయితే తిరుపతికి సరికొత్త గుర్తింపు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆధ్యాత్మిక పర్యాటకం, అంతర్జాతీయ పెట్టుబడులు పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని భావిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.