ఇంటి నుంచే పని చేయండి.. ఉద్యోగులకు ఢిల్లీ ప్రభుత్వం ఆదేశం
- ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బంది మాత్రమే హాజరు
- ఢిల్లీలో తీవ్ర స్థాయికి వాయు కాలుష్యం.. పడిపోయిన ఏక్యూఐ
- ప్రైవేటు ఆఫీసుల్లోనూ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం చేయించాలని ఆదేశాలు
ఈ మేరకు చర్యలు చేపట్టాలని సంబంధిత ప్రభుత్వ విభాగాల అధిపతులను ఆదేశించింది. ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో సిబ్బంది హాజరును తగ్గించాలని సూచించింది. అత్యవసర సిబ్బంది మినహా మిగిలిన ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ప్రైవేటు కంపెనీలను ఆదేశించింది. ఎన్విరాన్ మెంట్ (ప్రొటెక్షన్) యాక్ట్ 1986 లోని సెక్షన్ 5 ప్రకారం పర్యావరణ శాఖ సోమవారం ఈ ఆదేశాలు జారీ చేసింది.