Parkinson's Disease: పార్కిన్సన్స్ వ్యాధికి అసలు కారణమిదే.. ఆస్ట్రేలియా పరిశోధనలో కీలక విషయాల వెల్లడి
- మెదడులోని రక్తనాళాల్లో మార్పులే వ్యాధి తీవ్రతకు కారణం
- ప్రోటీన్ల కంటే రక్తనాళాల పాత్రే ఎక్కువని గుర్తింపు
- ఈ ఆవిష్కరణతో కొత్త చికిత్సలకు మార్గం సుగమం
పార్కిన్సన్స్ వ్యాధిపై ఇప్పటివరకు ఉన్న అవగాహనను మార్చేసే కీలక ఆవిష్కరణను ఆస్ట్రేలియా పరిశోధకులు కనుగొన్నారు. ఈ వ్యాధి కారణంగా మెదడులోని రక్తనాళాల్లో తీవ్రమైన మార్పులు సంభవిస్తాయని, ఇదే వ్యాధి ముదరడానికి ప్రధాన కారణమని వారు తేల్చారు. ఈ పరిశోధన భవిష్యత్తులో పార్కిన్సన్స్కు కొత్త చికిత్సా మార్గాలను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇప్పటివరకు పార్కిన్సన్స్కు మెదడులో ఆల్ఫా-సిన్యూక్లిన్ అనే ప్రోటీన్ పేరుకుపోవడమే కారణమని భావించేవారు. అయితే, ఆస్ట్రేలియాలోని న్యూరోసైన్స్ రీసెర్చ్ ఆస్ట్రేలియా (NeuRA) సంస్థ తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ప్రోటీన్ల కంటే మెదడులోని రక్తనాళాల్లో చోటుచేసుకునే మార్పులే వ్యాధి తీవ్రతలో కీలకపాత్ర పోషిస్తున్నాయని తేలింది. "సంప్రదాయకంగా పరిశోధకులు ప్రోటీన్లు, నరాల కణాల నష్టంపైనే దృష్టి పెట్టారు. కానీ, మేము మెదడులోని రక్తనాళాల వ్యవస్థపై దాని ప్రభావాన్ని చూపించగలిగాం" అని పరిశోధనలో కీలకపాత్ర పోషించిన డెర్యా డిక్ తెలిపారు.
తమ అధ్యయనంలో మెదడులోని కొన్ని ప్రాంతాల్లో రక్తనాళాలు బలహీనపడటాన్ని, ముఖ్యంగా పనికిరాని రక్త కేశనాళికల అవశేషాలు (స్ట్రింగ్ వెస్సెల్స్) పెరగడాన్ని గుర్తించినట్లు డెర్యా వివరించారు. దీనివల్ల మెదడులో రక్త ప్రసరణ, బ్లడ్-బ్రెయిన్ బ్యారియర్ పనితీరులో కూడా మార్పులు వస్తున్నాయని కనుగొన్నారు.
యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్, యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ సహకారంతో సాగిన ఈ పరిశోధన ఫలితాలను 'బ్రెయిన్' జర్నల్లో ప్రచురించారు. రక్తనాళాల్లో వస్తున్న ఈ మార్పులను లక్ష్యంగా చేసుకుని చికిత్స అందిస్తే, వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే తరహా మార్పులు అల్జీమర్స్, ఇతర మతిమరుపు వ్యాధులలో కూడా ఉన్నాయా? అనే కోణంలో అధ్యయనం చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పార్కిన్సన్స్ అనేది కదలికలు, మానసిక ఆరోగ్యం, నిద్ర వంటి సమస్యలకు దారితీసే నాడీ సంబంధిత వ్యాధి. దీనికి ఇప్పటివరకు పూర్తిస్థాయి నివారణ లేదు.
ఇప్పటివరకు పార్కిన్సన్స్కు మెదడులో ఆల్ఫా-సిన్యూక్లిన్ అనే ప్రోటీన్ పేరుకుపోవడమే కారణమని భావించేవారు. అయితే, ఆస్ట్రేలియాలోని న్యూరోసైన్స్ రీసెర్చ్ ఆస్ట్రేలియా (NeuRA) సంస్థ తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ప్రోటీన్ల కంటే మెదడులోని రక్తనాళాల్లో చోటుచేసుకునే మార్పులే వ్యాధి తీవ్రతలో కీలకపాత్ర పోషిస్తున్నాయని తేలింది. "సంప్రదాయకంగా పరిశోధకులు ప్రోటీన్లు, నరాల కణాల నష్టంపైనే దృష్టి పెట్టారు. కానీ, మేము మెదడులోని రక్తనాళాల వ్యవస్థపై దాని ప్రభావాన్ని చూపించగలిగాం" అని పరిశోధనలో కీలకపాత్ర పోషించిన డెర్యా డిక్ తెలిపారు.
తమ అధ్యయనంలో మెదడులోని కొన్ని ప్రాంతాల్లో రక్తనాళాలు బలహీనపడటాన్ని, ముఖ్యంగా పనికిరాని రక్త కేశనాళికల అవశేషాలు (స్ట్రింగ్ వెస్సెల్స్) పెరగడాన్ని గుర్తించినట్లు డెర్యా వివరించారు. దీనివల్ల మెదడులో రక్త ప్రసరణ, బ్లడ్-బ్రెయిన్ బ్యారియర్ పనితీరులో కూడా మార్పులు వస్తున్నాయని కనుగొన్నారు.
యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్, యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ సహకారంతో సాగిన ఈ పరిశోధన ఫలితాలను 'బ్రెయిన్' జర్నల్లో ప్రచురించారు. రక్తనాళాల్లో వస్తున్న ఈ మార్పులను లక్ష్యంగా చేసుకుని చికిత్స అందిస్తే, వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే తరహా మార్పులు అల్జీమర్స్, ఇతర మతిమరుపు వ్యాధులలో కూడా ఉన్నాయా? అనే కోణంలో అధ్యయనం చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పార్కిన్సన్స్ అనేది కదలికలు, మానసిక ఆరోగ్యం, నిద్ర వంటి సమస్యలకు దారితీసే నాడీ సంబంధిత వ్యాధి. దీనికి ఇప్పటివరకు పూర్తిస్థాయి నివారణ లేదు.