Jio: ట్రాయ్ ఆదేశాలతో జియో ముందడుగు.. చౌక రీఛార్జ్ ప్లాన్లు వచ్చేశాయ్!

Jio Launches New Affordable Recharge Plans
  • కేవలం కాలింగ్ కోసం రెండు కొత్త ప్లాన్లు
  • రూ.458, రూ.1958తో జియో కొత్త వాయిస్ ప్లాన్లు
  • రూ.1958తో ఏకంగా 365 రోజుల వ్యాలిడిటీ
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. కేవలం వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్‌లను మాత్రమే వినియోగించే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్లను ప్రవేశపెట్టింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆదేశాలకు అనుగుణంగా, డేటాతో సంబంధం లేకుండా తక్కువ ధరకే ఈ ప్లాన్లను అందిస్తోంది. రూ.458, రూ.1958 ధరలతో ఈ కొత్త ప్లాన్లు జియో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ప్లాన్ల వివరాలు
రూ.458 ప్లాన్: ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులకు 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దీని కింద దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. దీంతో పాటు 1000 ఎస్ఎంఎస్‌లు, జియో టీవీ, జియో సినిమా వంటి యాప్‌లకు ఉచిత యాక్సెస్ కూడా ఉంటుంది. ఈ ప్లాన్‌లో ఎలాంటి మొబైల్ డేటా లభించదు.

రూ.1958 ప్లాన్: దీర్ఘకాలిక వ్యాలిడిటీ కోరుకునే వారి కోసం జియో ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని వ్యాలిడిటీ 365 రోజులు. ఈ ప్లాన్ ద్వారా అపరిమిత వాయిస్ కాలింగ్, 3600 ఎస్ఎంఎస్‌లు, ఉచిత నేషనల్ రోమింగ్ సౌకర్యం పొందవచ్చు. జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటుంది.

ఈ కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టిన జియో, తన పాత ప్లాన్ల జాబితా నుంచి రెండు ప్లాన్లను తొలగించింది. రూ.479 (6జీబీ డేటా, 84 రోజులు), రూ.1899 (24జీబీ డేటా, 336 రోజులు) ప్లాన్లు ఇప్పుడు యూజర్లకు అందుబాటులో లేవు.
Jio
Reliance Jio
TRAI
Telecom Regulatory Authority of India
Jio recharge plans
prepaid plans
voice calling
SMS
Jio TV
Jio Cinema

More Telugu News