ట్రాయ్ ఆదేశాలతో జియో ముందడుగు.. చౌక రీఛార్జ్ ప్లాన్లు వచ్చేశాయ్!

  • కేవలం కాలింగ్ కోసం రెండు కొత్త ప్లాన్లు
  • రూ.458, రూ.1958తో జియో కొత్త వాయిస్ ప్లాన్లు
  • రూ.1958తో ఏకంగా 365 రోజుల వ్యాలిడిటీ
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. కేవలం వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్‌లను మాత్రమే వినియోగించే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్లను ప్రవేశపెట్టింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆదేశాలకు అనుగుణంగా, డేటాతో సంబంధం లేకుండా తక్కువ ధరకే ఈ ప్లాన్లను అందిస్తోంది. రూ.458, రూ.1958 ధరలతో ఈ కొత్త ప్లాన్లు జియో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ప్లాన్ల వివరాలు
రూ.458 ప్లాన్: ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులకు 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దీని కింద దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. దీంతో పాటు 1000 ఎస్ఎంఎస్‌లు, జియో టీవీ, జియో సినిమా వంటి యాప్‌లకు ఉచిత యాక్సెస్ కూడా ఉంటుంది. ఈ ప్లాన్‌లో ఎలాంటి మొబైల్ డేటా లభించదు.

రూ.1958 ప్లాన్: దీర్ఘకాలిక వ్యాలిడిటీ కోరుకునే వారి కోసం జియో ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని వ్యాలిడిటీ 365 రోజులు. ఈ ప్లాన్ ద్వారా అపరిమిత వాయిస్ కాలింగ్, 3600 ఎస్ఎంఎస్‌లు, ఉచిత నేషనల్ రోమింగ్ సౌకర్యం పొందవచ్చు. జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటుంది.

ఈ కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టిన జియో, తన పాత ప్లాన్ల జాబితా నుంచి రెండు ప్లాన్లను తొలగించింది. రూ.479 (6జీబీ డేటా, 84 రోజులు), రూ.1899 (24జీబీ డేటా, 336 రోజులు) ప్లాన్లు ఇప్పుడు యూజర్లకు అందుబాటులో లేవు.


More Telugu News