AP Government: వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు తియ్యని కబురు చెప్పిన ఏపీ ప్రభుత్వం

AP Government Approves Inter District Transfers for Spouses Working in Sachivalayams
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. భార్యాభర్తలు (స్పౌజ్) వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, వారి అంతర్‌జిల్లా బదిలీలకు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి కాటమనేని భాస్కర్ సోమవారం అధికారికంగా ఉత్తర్వులు (జీవో) జారీ చేశారు.

సచివాలయ ఉద్యోగుల నుంచి చాలాకాలంగా వస్తున్న విజ్ఞప్తులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. భార్యాభర్తలు ఒకేచోట పనిచేసేందుకు వీలు కల్పించే ఈ నిర్ణయంతో వేలాది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. బదిలీల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హులైన ఉద్యోగులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఈ బదిలీల ప్రక్రియను నవంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ పనితీరు మెరుగుపడటంతో పాటు, కుటుంబపరమైన ఒత్తిడిని తగ్గిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.
Go Back to Shorts
AP Government
Andhra Pradesh
Grama Sachivalayam
Ward Sachivalayam
AP Employees Transfers
Inter District Transfers
Spouse Transfers
Katamneni Bhaskar
AP Government Orders

More Telugu News