రేపు 9 గంటలకు ఇంకో బిగ్ న్యూస్... మరోసారి సస్పెన్స్ కు తెరలేపిన మంత్రి నారా లోకేశ్
- ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడి రానుందంటూ మంత్రి నారా లోకేశ్ ట్వీట్
- ఓ గ్లోబల్ ఫండ్ రాష్ట్రానికి వస్తోందని వెల్లడి
- రేపు (శుక్రవారం) ఉదయం 9 గంటలకు కీలక ప్రకటన ఉంటుందని స్పష్టం
- ఏ సంస్థో ఊహించగలరా అంటూ నెటిజన్లలో ఆసక్తి రేపిన లోకేశ్
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక, రాజకీయ వర్గాల్లో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన ఒక ట్వీట్ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్రంలోకి ఓ భారీ అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులతో అడుగుపెట్టబోతున్నట్టు ఆయన పరోక్షంగా సంకేతాలిచ్చారు. పూర్తి వివరాలను శుక్రవారం ఉదయం 9 గంటలకు వెల్లడిస్తామని... ఎవరికైనా తెలిస్తే చెప్పుకోండి చూద్దాం అంటూ సస్పెన్స్కు తెరలేపారు.
గురువారం నారా లోకేశ్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. "కార్పొరేట్ బోర్డు రూముల్లో కొన్ని ఆసక్తికరమైన గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్పై భారీగా పందెం కాసేందుకు ఒక గ్లోబల్ ఫండ్ సిద్ధమవుతోంది. ఎవరో ఊహించగలరా? రేపు ఉదయం 9 గంటలకు మరో పెద్ద ప్రకటన వెలువడనుంది" అని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. దీనికి "#ChooseSpeedChooseAP" (వేగాన్ని ఎంచుకోండి.. ఏపీని ఎంచుకోండి) అనే హ్యాష్ట్యాగ్ను కూడా జోడించారు.
నిన్న ఇలాంటి ట్వీటే ఒకటి చేసిన నారా లోకేశ్.... ఇవాళ బిగ్ రివీల్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి దూరమైన 'రెన్యూ' పవర్ సంస్థ మళ్లీ రాష్ట్రానికి వస్తోందని, భారీగా పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. తద్వారా నిన్నటి ట్వీట్ ద్వారా ఏర్పడిన సస్పెన్స్ కు తెరదించారు. తాజాగా ఇవాళ చేసిన ఇంకో ట్వీట్ తో మరోసారి సస్పెన్స్ కు తెరలేపారు.
లోకేశ్ ట్వీట్తో ఏపీకి రాబోయే ఆ భారీ పెట్టుబడి ఏ రంగంలో ఉండబోతోంది? ఏ సంస్థ పెట్టుబడి పెట్టనుంది? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 'గ్లోబల్ ఫండ్' అని ప్రస్తావించడంతో అది భారీ ఎత్తున నిధులు సమీకరించే అంతర్జాతీయ ఆర్థిక సంస్థ అయి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సంస్థల పెట్టుబడులు సాధారణంగా వేల కోట్ల రూపాయల స్థాయిలో ఉంటాయి. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిస్తుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెట్టుబడి పెట్టబోయే సంస్థ ఏదై ఉంటుందనే దానిపై నెటిజన్లు రకరకాల అంచనాలు వేస్తున్నారు. మొత్తం మీద, ఈ గ్లోబల్ ఫండ్ ఏది, ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టనుంది అనే పూర్తి వివరాలు తెలియాలంటే శుక్రవారం ఉదయం 9 గంటల వరకు వేచి చూడాల్సిందే.
గురువారం నారా లోకేశ్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. "కార్పొరేట్ బోర్డు రూముల్లో కొన్ని ఆసక్తికరమైన గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్పై భారీగా పందెం కాసేందుకు ఒక గ్లోబల్ ఫండ్ సిద్ధమవుతోంది. ఎవరో ఊహించగలరా? రేపు ఉదయం 9 గంటలకు మరో పెద్ద ప్రకటన వెలువడనుంది" అని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. దీనికి "#ChooseSpeedChooseAP" (వేగాన్ని ఎంచుకోండి.. ఏపీని ఎంచుకోండి) అనే హ్యాష్ట్యాగ్ను కూడా జోడించారు.
నిన్న ఇలాంటి ట్వీటే ఒకటి చేసిన నారా లోకేశ్.... ఇవాళ బిగ్ రివీల్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి దూరమైన 'రెన్యూ' పవర్ సంస్థ మళ్లీ రాష్ట్రానికి వస్తోందని, భారీగా పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. తద్వారా నిన్నటి ట్వీట్ ద్వారా ఏర్పడిన సస్పెన్స్ కు తెరదించారు. తాజాగా ఇవాళ చేసిన ఇంకో ట్వీట్ తో మరోసారి సస్పెన్స్ కు తెరలేపారు.
లోకేశ్ ట్వీట్తో ఏపీకి రాబోయే ఆ భారీ పెట్టుబడి ఏ రంగంలో ఉండబోతోంది? ఏ సంస్థ పెట్టుబడి పెట్టనుంది? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 'గ్లోబల్ ఫండ్' అని ప్రస్తావించడంతో అది భారీ ఎత్తున నిధులు సమీకరించే అంతర్జాతీయ ఆర్థిక సంస్థ అయి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సంస్థల పెట్టుబడులు సాధారణంగా వేల కోట్ల రూపాయల స్థాయిలో ఉంటాయి. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిస్తుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెట్టుబడి పెట్టబోయే సంస్థ ఏదై ఉంటుందనే దానిపై నెటిజన్లు రకరకాల అంచనాలు వేస్తున్నారు. మొత్తం మీద, ఈ గ్లోబల్ ఫండ్ ఏది, ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టనుంది అనే పూర్తి వివరాలు తెలియాలంటే శుక్రవారం ఉదయం 9 గంటల వరకు వేచి చూడాల్సిందే.