షేక్‌పేట్‌లో ఓటు వేసిన రాజమౌళి దంపతులు

  • జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటేసిన రాజమౌళి దంపతులు
  • షేక్‌పేట్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగం
  • క్యూలో నిలబడి ఓటు వేసిన జక్కన్న
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉపఎన్నిక పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది. సాధారణ ప్రజలతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగా, ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన భార్య రమతో కలిసి వచ్చి ఓటేశారు.

షేక్‌పేట్‌ డివిజన్‌ పరిధిలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి రాజమౌళి దంపతులు సాదాసీదాగా విచ్చేశారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా సాధారణ ఓటర్లలాగే క్యూలో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ ఓటు ప్రాముఖ్యతను వివరించారు.

"ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ ఎంతో విలువైనది. దేశ భవిష్యత్తును మన ఓటే నిర్దేశిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలి. ఇది కేవలం మన బాధ్యతే కాదు, మన హక్కు కూడా" అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

పోలింగ్ కేంద్రంలో రాజమౌళి దంపతులను చూసిన పలువురు ఓటర్లు, అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కొందరు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు.


More Telugu News